Begin typing your search above and press return to search.

ప్రాజెక్ట్‌ కే : అతడు ఇప్పుడెందుకు రీ ట్వీట్‌ చేశాడు?

By:  Tupaki Desk   |   21 Nov 2021 5:31 AM GMT
ప్రాజెక్ట్‌ కే : అతడు ఇప్పుడెందుకు రీ ట్వీట్‌ చేశాడు?
X
ప్రభాస్ వరుసగా పలు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఈయన వచ్చే సంక్రాంతికి రాధే శ్యామ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా తర్వాత సలార్ మరియు ఆదిపురుష్ లు లైన్ లో ఉన్నాయి. ఈ సినిమాలు కాకుండా మహా నటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో అమితాబచ్చన్‌.. దీపికా పదుకనేతో పాటు ఇంకా ప్రముఖ స్టార్స్ కనిపించబోతున్నారు. టైమ్ ట్రావెల్‌ నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అద్బుతమైన ఒక కథను ప్రపంచానికి చూపించేందుకు దర్శకుడు నాగ్‌ అశ్విన్ సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. అమితాబ్ పై ఒక కీలక షెడ్యూల్‌ ను ముగించారు.

గత కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. రాధే శ్యామ్‌ ను ముగించడం.. ఆదిపురుష్‌ మరియు సలార్ షూటింగ్ లతో ప్రభాస్ బిజీగా ఉండటం వల్ల ప్రాజెక్ట్ కే గురించిన చర్చ అసలు కనిపించడం లేదు. ఈ సమయంలో ప్రాజెక్ట్‌ కే గురించి ఒక చిన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా రూపొందబోతుంది.

కనుక ప్రతి చిన్న విషయం కూడా ఈ సినిమా విషయంలో చాలా పెద్ద విషయమే అనడంలో సందేహం లేదు. ఇంతకు ఆ చిన్న విషయం ఏంటీ అంటే అప్పుడెప్పుడో జులైలో వైజయంతి మూవీస్ వారు ప్రాజెక్ట్‌ కే క్లాప్ పడింది అంటూ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ లో క్లాప్‌ బోర్డ్‌ ను చూపించడం జరిగింది. అమితాబచ్చన్‌ పై ఆ షూట్ ను చేశారు. ఆ ట్వీట్‌ ను ఇప్పుడు తమిళ సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణ్‌ రీ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

మొదటగా ప్రాజెక్ట్‌ కే కు మిక్కీ జే మేయర్‌ సంగీతాన్ని అందించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన్నే కన్ఫర్మ్‌ చేసే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. ఎందుకంటే ఆయనకు దర్శకుడు నాగ్‌ అశ్విన్ కు మద్య మంచి ర్యాపో ఉంది. అందుకే ఇద్దరి కాంబోలో ఈ సినిమా వస్తుందని అనుకున్నారు. ఇప్పుడు తమిళ దర్శకుడు సంతోష్‌ నారాయణ రీ ట్వీట్‌ చేశాడు అంటే ఖచ్చితంగా అతడు ఈ ప్రాజెక్ట్ లో ఎంటర్ అయ్యాడు అనిపిస్తుంది.

ఇన్ని నెలల తర్వాత ఊరికే ఏమీ రీ ట్వీట్‌ చేయరు. ప్రాజెక్ట్‌ కే క్లాప్‌ పోస్టర్ ను రీ ట్వీట్‌ చేశాడు కనుక ఖచ్చితంగా అతడు ఈ సినిమా లో భాగస్వామ్యం అవ్వబోతున్నాడు అంటూ అంతా బలంగా నమ్ముతున్నారు. మొత్తం సంగీత దర్శకుడు మారాడా.. లేదంటే ఒక్కరికంటే ఎక్కువ మంది ఈ సినిమాకు వర్క్‌ చేయబోతున్నారా అనేది చూడాలి. మొత్తానికి సంతోష్‌ నారాయణ్ రీ ట్వీట్ పెద్ద సస్పెన్స్ గా మారింది.