Begin typing your search above and press return to search.

బిజినెస్ లో సంక్రాంతి పుంజులు..ఎవ‌రిది పైచేయి?

By:  Tupaki Desk   |   3 Nov 2019 9:23 AM GMT
బిజినెస్ లో సంక్రాంతి పుంజులు..ఎవ‌రిది పైచేయి?
X
ఈ సంక్రాంతి పందెం అంత‌కంత‌కు హీట్ పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. అగ్ర హీరోల మ‌ధ్య నువ్వా నేనా? అంటూ బెట్టింగ్ న‌డుస్తోంది. అయితే ఈ వార్ లో ఎవ‌రిది పై చేయి? ఎవ‌రి బిజినెస్ ఎంత‌? అన్న‌ది ప‌రిశీలిస్తే షాకింగ్ నిజం తెలిసింది.

అల్లు అర్జున్‌.. మ‌హేష్ మ‌ధ్య‌నే సిస‌లైన పోటీ. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న ద‌ర్బార్ రిలీజ‌వుతున్నా.. టాలీవుడ్ స్టార్ హీరోలపైనే భారీగా బెట్టింగ్ న‌డుస్తోంది. సంక్రాంతి పోటీకి ఇంకా స‌మ‌యం వున్నా ఇప్ప‌టికే ప్రీబిజినెస్ సంగ‌తులు లీక‌వుతూనే ఉన్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. తెలుగు రాష్ట్రాల బిజినెస్ లో బ‌న్ని.. మ‌హేష్ దూసుకుపోతున్నారు. అయితే నైజాం ఏరియాలో అల్లు అర్జున్‌పై మ‌హేష్ పై చేయి సాధించడం ఆస‌క్తిక‌రంగా మారింది. అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో..`. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాతో మ‌హేష్ కూడా పోటీకి దిగుతున్నాడు.

మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు` పైనా భారీ బెట్టింగ్ న‌డుస్తోంది. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు- అనిల్ సుంక‌ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేశ భ‌క్తి నేప‌థ్యంలో ఓ సైనికుడి క‌థ‌గా రూపొందుతోంది. ఈ చిత్రం కూడా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కాబోతోంది. ఈ చిత్ర నైజాం ఏరియా రైట్స్‌ని 25 కోట్ల‌కు అమ్మేశారని తెలుస్తోంది. అల్లు అర్జున్ న‌టిస్తున్న `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రానికి మాత్రం నైజాం రైట్స్ రూపంలో 20 కోట్ల వ‌ర‌కూ ద‌క్కింది. దీంతో అల్లు అర్జున్ సినిమాని మించి మ‌హేష్ చిత్రానికి మ‌రో రూ.5 కోట్లు అద‌నంగా వ‌చ్చిన‌ట్ల‌యింది. ఈ లెక్క‌న అల్లు అర్జున్ పై మ‌హేష్ పై చేయి సాధించిన‌ట్ల‌యింది. నా పేరు సూర్య ఫ్లాప్ త‌ర్వాత బ‌న్ని ఎంతో ఛాలెంజింగ్ గా చేస్తున్న అల వైకుంఠ‌పుర‌ములో విజ‌యంపై భారీ ఆశ‌లున్నాయి. అలాగే భ‌ర‌త్ అనే నేను.. మ‌హ‌ర్షి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల త‌ర్వాత మ‌హేష్ హ్యాట్రిక్ కోసం ఎంతో శ్ర‌మిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బిజినెస్ డీటెయిల్స్ ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.