Begin typing your search above and press return to search.

సమంత సినిమాను తెలుగులో ఎవరూ పట్టించుకోవడం లేదేంటి..?

By:  Tupaki Desk   |   20 March 2022 12:30 AM GMT
సమంత సినిమాను తెలుగులో ఎవరూ పట్టించుకోవడం లేదేంటి..?
X
దక్షిణాది అగ్ర కథానాయికలలో ఒకరైన సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిపోయింది. చివరిసారిగా రెండేళ్ల క్రితం వచ్చిన 'జాను' సినిమాతో పలకరించిన సామ్.. అప్పటి నుంచి మరో పూర్తి స్థాయి తెలుగు సినిమా చేయలేదు.

ఇటీవల 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా' అనే స్పైసీ ఐటెమ్ సాంగ్ తో ఊపేసింది. అలానే ఆ మధ్య 'ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇది సక్సెస్ అవ్వడంతో నేషనల్ వైడ్ పాపులారిటీ వచ్చింది. ఈ క్రేజ్ తో దర్శకనిర్మాతలు ఆమెతో పాన్ ఇండియా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.

సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే పౌరాణిక చిత్రంలో నటిస్తోంది. పాన్ ఇండియాను టార్గెట్ చేయబోతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. విజువల్ గ్రాండియర్ గా ఉండబోతోందని భావిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. అయితే అంతకంటే ముందే ఓ డబ్బింగ్ సినిమాతో సామ్ తెలుగు ఆడియన్స్ ని పలకరించబోతోంది.

విజయ్ సేతుపతి - నయనతారలతో కలిసి సమంత నటించిన చిత్రం ‘కాథువాక్కుల రెండు కాదల్’. నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ''కణ్మణి రాంబో ఖతీజా'' అనే టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో కణ్మని పాత్రలో నయన్ - రాంభోగా సేతుపతి - ఖతిజా పాత్రలో సామ్ కనిపించనున్నారు.

'కణ్మణి రాంబో ఖతీజా' చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి ప్రేమించడం.. ఇద్దరితో కలిసి ఉండాలనుకునే హీరో కథే ఈ సినిమా అని తెలుస్తోంది. అయితే ఈ ట్రైలర్ కు ఇక్కడ ఆశించిన స్థాయిలో బజ్ రాలేదు. ఇలాంటి సినిమా ఒకటి విడుదల కానుందని చాలామందికి తెలియలేదు.

దీంతో అప్పుడెప్పుడో 'జాను' తో పరాజయాన్ని మూటగట్టుకున్న సమంత.. డబ్బింగ్ సినిమాతో ఏ మేరకు మెప్పిస్తుందో అని అభిమానులు ఆలోచిస్తున్నారు. కాకపోతే అదే రోజున మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా విడుదల ఉంది. మరి దీన్ని తట్టుకొని 'కణ్మణి రాంబో ఖతీజా' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇదిలా ఉంటే సమంత ఇప్పుడు 'యశోద' అనే పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో పాల్గొంటోంది. త్వరలోనే 'అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్' అనే హాలీవుడ్ సినిమా చేయనుంది. అలానే బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో కలిసి సామ్ ఓ వెబ్ సిరీస్ చేయబోతోంది. విడాకుల ప్రకటన తర్వాత సమంత ఇలా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ తో బిజీగా మారుతోంది.