Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ లో చెయ్ - సామ్ ఎక్కడికి వెళ్తున్నారు...?

By:  Tupaki Desk   |   15 May 2020 10:48 AM GMT
లాక్ డౌన్ లో చెయ్ - సామ్ ఎక్కడికి వెళ్తున్నారు...?
X
క‌రోనా కారణంగా విధించిన లాక్‌ డౌన్‌ తో సినీ సెల‌బ్రెటీలంతా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ స‌మ‌యాన్ని కుటుంబంతో క‌ల‌సి స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా త‌మ అభిమానులు తెర‌పై మిస్సవుతున్న ఎంటర్టైన్మెంట్ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఒకవైపు వర్కౌట్ వీడియోలను ఫోటోల‌ను, టిక్ టాక్ వీడియోల‌ను షేర్ చేస్తూ.. మరోవైపు త‌మ ఫ్యాన్స్‌ కు క‌రోనా స‌మ‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు సూచిస్తున్నారు. అంతేకాకుండా సోష‌ల్ మీడియాలో త్రో బ్యాక్ ఫోటోస్ హవా కొనసాగిస్తున్నారు. కొందరు సెల‌బ్రెటీలు త‌మ‌కు సంబంధించిన పాత ఫోటోల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌ను అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే స‌మంత అక్కినేని కూడా లాక్ డౌన్ లో రకరకాల పోస్టులతో సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. డైలీ ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇంతక ముందు ఆమె భ‌ర్త నాగ చైత‌న్య‌ త‌మ పెంపుడు కుక్క హ్యాష్‌ తో క‌లిసి కారులో కూర్చున్న ఓ పాత‌ ఫోటోను షేర్ చేసింది. ఇప్పుడు తాజాగా సామ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో వైరల్ అయింది.

సమంత తన భర్త నాగ చైతన్యతో కలిసి బైక్ మీద కూర్చొని ఉన్న ఫోటో షేర్ చేసింది. నాగ చైతన్య హెల్మెట్ పెట్టుకొని బైక్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉండగా సామ్ మరో హెల్మెట్ పట్టుకొని వెనుక కూర్చొని ఉంది. దీనిపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటో చూసిన అభిమానులు మాత్రం లాక్ డౌన్ వేళ చెయ్ - సామ్ ఎక్కడికి పోతున్నారో అని తెగ అందోళన చెందుతున్నారు. కాకపోతే ఇది త్రో బ్యాక్ పిక్ అయ్యుండొచ్చు. ఎందుకంటే లాక్ డౌన్ లో ఇలా బయట తిరిగే పరిస్థితి లేదు. అందులోనూ ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్లే ఛాన్స్ లేదు. చెయ్ - సామ్ ఇద్దరూ కలిసి బైక్ మీద షికార్లు కొట్టొస్తామంటే పోలీసులు ఊరుకుంటారా ఏంటి. ఇది ఖచ్చితంగా ఓల్డ్ ఫోటో అయ్యుంటదనే నిర్ధారణకు రావొచ్చు. ఇకపోతే పెళ్లి అయిన దగ్గరి నుండి ఈ జంట ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో అందరికి తెలిసిందే.

తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ అమ్మాయి సామ్. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించి అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. అక్కినేని ఇంటి కోడలైన తర్వాత ఈమె కెరీర్ మూడు హిట్లు.. నాలుగు సినిమాలన్నట్టుగా సాగిపోతుంది. ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఇంకోవైపు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసే విధానం చూసి ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్స్ లో ఒకరుగా వెలుగుతోంది. ఇటీవల సామ్ ఒక ఇంగ్లీష్ పత్రిక నిర్వహించే సర్వే లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ టైటిల్‌ కైవసం చేసుకుంది. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌ సెకండ్ సీజన్ లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.