Begin typing your search above and press return to search.

నిజంగా అవన్నీ సమంత వాళ్ళ అమ్మే చెప్పింది..!

By:  Tupaki Desk   |   3 Dec 2021 4:06 AM GMT
నిజంగా అవన్నీ సమంత వాళ్ళ అమ్మే చెప్పింది..!
X
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. వృత్తిపరమైన జీవితంతో పాటుగా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా సామ్ ఈ వేదిక ద్వారానే వెల్లడిస్తూ ఉంటారు. ఇటీవల తన భర్త అక్కినేని నాగ చైతన్య తో విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి.. ఇన్స్టాగ్రామ్ లో పలు ఆసక్తికరమైన సందేశాలను పోస్ట్ చేస్తూ వస్తోంది. 'మై మమ్మా సెడ్' (మా అమ్మ చెప్పింది) అనే హ్యాష్ ట్యాగ్ ని జోడిస్తూ సమంత షేర్ చేసే కోట్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ స్ఫూర్తిదాయకమైన కోట్స్ ను నిజంగానే సమంత తల్లే షేర్ చేస్తుందా? లేదా సామ్ తన తల్లి పేరు మీద పరోక్షంగా ఎవరినో టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతోందా? అని చాలామంది ఆశ్చర్యపోయారు. చైతూ తో విడాకుల ప్రకటన తర్వాత ఆమె షేర్ చేస్తున్న సందేశాలు కావడంతో.. వీటిపై పెద్ద ఎత్తున చర్యలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి సందేహాలన్నింటినీ సోషల్ మీడియాలో నివృత్తి చేసింది సామ్.

ఇన్స్టాగ్రామ్ లో సమంత తన తల్లితో జరిపిన వాట్సాప్ చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది. ఇందులో వారి మధ్య జరిగిన పర్సనల్ చాటింగ్ కనిపించకుండా.. కేవలం ఇన్స్పిరేషనల్ కోట్స్ మాత్రమే కనిపించేలా జాగ్రత్త పడింది. దీనిని బట్టి రెగ్యులర్ గా ఆమె తల్లి కొన్ని సందేశాత్మక ఆలోచనలు ఫార్వార్డ్ చేయగా.. వాటిని సామ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తోందని స్పష్టం అయింది. ఇకపై 'అమ్మ చెప్పింది' అంటూ స్టార్ హీరోయిన్ ఏదైనా కోట్ ని షేర్ చేస్తే.. అది ఆమె తల్లి నుండి మాత్రమే వచ్చిందని అందరూ నమ్మాల్సి ఉంటుంది.

నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత గచ్చిబౌలిలో ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇది పెళ్ళైన కొత్తలో ఇద్దరూ కలిసి తీసుకున్న ఇల్లు. అప్పుడప్పుడు చెన్నైకి వెళ్లి కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతోంది. ఇక తన స్నేహితులతో కలిసి విహార యాత్రలు - తీర్థ యాత్రలకు వెళ్తోంది. మరోవైపు కెరీర్ మీద ఫోకస్ పెడుతూ వరుస ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తోంది.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో సమంత మరో మైలురాయిని చేరుకుంది. ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో సామ్ 20 మిలియన్ల ప్యాలోవర్స్ మార్క్ రీచ్ అయింది. తనను అనుసరించే వారి సంఖ్య ఇరవై మిలియన్లు దాటినందుకు, అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ.. సమంత తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.