Begin typing your search above and press return to search.

ఆలియాని వెన‌క్కి నెట్ట‌డానికి లంచం ఇచ్చాను!-సామ్‌

By:  Tupaki Desk   |   24 July 2022 4:55 AM GMT
ఆలియాని వెన‌క్కి నెట్ట‌డానికి లంచం ఇచ్చాను!-సామ్‌
X
తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. దేశవ్యాప్తంగా అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న క‌థానాయిక‌గా సమంత రూత్ ప్రభు పేరు మార్మోగుతోంది. ఇటీవ‌లి కాలంలో సౌత్ నుంచి ఒక క‌థానాయిక ఈ స్థాయిలో ఉత్త‌రాదిన ఫాలోయింగ్ సంపాదించ‌డం అరుదు. ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 2లో రాజీ పాత్ర‌తో ఉత్త‌రాది వారికి క‌నెక్ట‌యిన సామ్ ఆ త‌ర్వాతా `ఊ అంటావా ఊఊ అంటావా!` (పుష్ప‌) పాటతో అక్క‌డ యూత్ ని గుండెల్లో గుడి క‌ట్టుకుంది.

ఇటీవల కరణ్ జోహార్ `కాఫీ విత్ కరణ్- సీజ‌న్ 7` మూడవ ఎపిసోడ్ లో రెడ్ హాట్ లుక్ తో క‌ట్టి ప‌డేసింది. ఖిలాడీ అక్షయ్ కుమార్ తో క‌లిసి సామ్ క‌ర‌ణ్ షోలో పాల్గొంది. ఈ ఎపిసోడ్ బంప‌ర్ హిట్ అయ్యింది. ఈ షోలో సమంత పలు విషయాలపై దాప‌రికం అన్న‌దే లేకుండా నిక్కచ్చిగా మాట్లాడింది.

ఇక ఇటీవ‌లి ఓ స‌ర్వే గురించి క‌ర‌ణ్ జోహార్ ఈ షోలో ప్ర‌శ్నించారు. ప్ర‌ఖ్యాత ఓర్మాక్స్ (Ormax) జాబితాలో అత్యంత ప్రజాదరణ పొందిన క‌థానాయిక‌గా స‌మంత పేరు టాప్ వ‌న్ గా నిలిచింద‌ని.. ఆలియా భట్- నయనతార - దీపికా పదుకొనే -కాజల్ అగర్వాల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారని కరణ్ వెల్లడించాడు. అయితే ఇది ఎలా సాధ్య‌మైంది? అన్న‌దానికి సామ్ ఎంతో ఫ‌న్నీ ఆన్స‌ర్ ఇచ్చారు. దీనిపై సమంత స్పందిస్తూ.. ``నిజాయితీగా ఉండాలి.. ఓర్మాక్స్ వారికి డబ్బు చెల్లించాను`` అంటూ చమత్కరించింది. కరణ్ రెట్టిస్తూ మ‌రోసారి ఇదే ప్ర‌శ్న‌ను అడిగాడు. ``మీరు అలియా భట్ ని ఓడించారు. అది ఎలా అనిపిస్తుంది? అనగానే.. ``క్షమించండి... అధిక ధర చెల్లిస్తేనే ఇది సాధ్యం`` అని ఫ‌న్ ని కంటిన్యూ చేసింది.

ఈ ఎపిసోడ్ లో భర్త నాగ చైతన్య గురించి కూడా మాట్లాడింది. గత ఏడాది ఈ జంట విడిపోయిన‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. సోషల్ మీడియా పోస్ట్ లో వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత సమంత ఆన్ లైన్ లో దారుణంగా ట్రోలింగ్ కి గురైంది. సామాజిక మాధ్య‌మాల్లో ఇలా ఓపెన‌వ్వ‌డం వ‌ల్ల‌నే తీవ్ర‌మైన ట్రోలింగ్ జ‌రిగింద‌ని భావిస్తున్నారా? అని క‌ర‌ణ్ ప్ర‌శ్నించారు.

దానికి స్పందిస్తూ... అవును.. నా జీవితంలో చాలా విషయాలను పార‌ద‌ర్శ‌కంగా బహిర్గతం చేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. విడిపోయినప్పుడు నేను అలా చేయ‌డంపై కలత చెందలేదు కూడా. ఎందుకంటే అభిమానులు నా జీవితంలో పెట్టుబడి పెట్టారు. వారికి సమాధానం చెప్ప‌డం నా బాధ్యత. ఆ సమయంలో నేను అంత‌కుమించి ఏమీ చేయ‌లేక‌పోయాను... నేను దాని నుండి ఓకే.. బ‌య‌ట‌కు వచ్చానని అనుకుంటున్నాను. ఓకే కంటే బెటర్ !.. అని అన్నారు.

సామ్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. త‌దుప‌రి శాకుంతలం- యశోద విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఖుషి సినిమాలో న‌టిస్తోంది. సమంత బాలీవుడ్ అరంగేట్రం గురించి క‌థ‌నాలొస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వెలువ‌డాల్సి ఉంది.

సామ్ పై ఈ గుస‌గుస ఏమిటో!

బ్రేక‌ప్ త‌ర్వాత స‌మంత పూర్తిగా హిందీ చిత్ర‌సీమ‌పై దృష్టి సారించింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. బాలీవుడ్ లో త‌న కెరీర్ ని పెద్ద స్థాయిలో మలుచుకునేందుకు సామ్ సీరియ‌స్ ప్ర‌య‌త్నాల్లో ఉంద‌ని అభిమానుల్లో గుస‌గుస వినిపించింది. ఇటీవ‌ల సామ్ ప్ర‌య‌త్నాలు చూస్తుంటే అది నిజ‌మేన‌ని కూడా అంగీక‌రించాల్సి వ‌స్తోంది. స‌మంత బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు క‌మిట‌వుతూ బాలీవుడ్ అగ్ర హీరోలు నిర్మాత‌ల‌తో టై అప్ అవుతుండ‌డం సంచ‌ల‌నంగా మారింది.

స‌మంత వ‌రుస‌గా మూడు నాలుగు హిందీ చిత్రాల‌కు క‌మిటైంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇందులో ఆయుష్మాన్ ఖురానాతో డెబ్యూ సినిమా ఉంటుంద‌ని అటుపై అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న న‌టిస్తుంద‌ని కూడా టాక్ వినిపించింది. ఇంత‌లోనే యూరి ఫేం విక్కీ కౌశల్ స‌ర‌స‌న‌ ఇమ్మోర్టల్ అశ్వథామ చిత్రంలోనూ నాయిక‌గా న‌టించ‌నుంద‌ని టాక్ వినిపించింది.

అయితే ఇంత వేగంగా ఇన్ని సినిమాలు ఎలా క‌మిటైంది? అంటే దానివెన‌క తెలివైన వ్యూహం ఇప్పుడు బ‌య‌టప‌డింది. వాస్తవానికి ప్ర‌భాస్.. విజ‌య్ దేవ‌రకొండ లాంటి ద‌క్షిణాది ట్యాలెంట్ ని ఎంక‌రేజ్ చేసిన క‌ర‌ణ్ జోహార్ ఇప్పుడు స‌మంత‌ కోసం బాలీవుడ్ కి వార‌ధిగా మారాడని టాక్ వినిపిస్తోంది. సామ్ కి తాజా ప్రాజెక్ట్‌లన్నింటినీ సెట్ చేస్తున్నాడని బాలీవుడ్ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. స‌మంత‌తో త‌ను న‌టించిన సినిమాల‌తో క‌ర‌ణ్ కి అనుబంధం లేదు. కానీ కాఫీ విత్ క‌ర‌ణ్ 7 షో వ‌ల్ల‌ ఇరువురి న‌డుమా చ‌క్క‌ని స్నేహం కుదిరింది. అదే క్ర‌మంలో స‌మంత‌కు క‌రణ్ గాడ్ ఫాద‌ర్ గా మారారన్న గుస‌గుసా వైర‌ల్ అయిపోతోంది. క‌ర‌ణ్ తో స్నేహం పెద్ద‌గానే వ‌ర్క‌వుట‌వుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు క‌మిట‌య్యేందుకు బాలీవుడ్ లో స్థాయిని పెంచుకునేందుకు స‌మంత కు అన్నీ క‌లిసొస్తున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది.