Begin typing your search above and press return to search.

దీంతో సమంత బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగింది

By:  Tupaki Desk   |   3 Dec 2021 12:30 AM GMT
దీంతో సమంత బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగింది
X
సమంత గత కొన్ని వారాలుగా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. ఇంతకు ముందు కూడా ఆమె సోషల్‌ మీడియాలో తరచు ఫొటోలు షేర్ చేసేది. కాని ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ఆమె పోస్ట్‌ లు సోషల్‌ మీడియాలో షేర్ అవుతున్నాయి. ముఖ్యంగా చైతూతో బ్రేకప్ చెప్పిన తర్వాత ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో ఫుల్‌ బిజీ అవ్వడం ను గమనిస్తున్నాం అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆమె తన మార్కెట్‌ ను కూడా విస్తరించుకుంటూ ఉంది. మొన్నటి వరకు తెలుగు.. తమిళ్ లో మాత్రమే ఈమె నటించింది. కాని ఇక మీదట ఈమె చేయబోతున్న సినిమాల్లో ఎక్కువ శాతం పాన్‌ ఇండియా సినిమాలే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

సోషల్‌ మీడియా ద్వారా సెలబ్రెటీలు ఈమద్య కాలంలో భారీ ఎత్తున సంపాదిస్తున్నారు. కొందరు స్టార్స్ వారి సినిమాల పారితోషికం కంటే ఎక్కువగా వారి ఇన్ స్టా గ్రామ్ ఆదాయంను సంపాదిస్తున్నారు. ఎంత మంది ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే అంత ఎక్కువ వారి బ్రాండ్ వాల్యూ ఉంటుంది. సమంత ఇన్ స్టా లో ఏకంగా 20 మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో ఈమె ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగింది. సమంత ఫాలోవర్స్ సంఖ్య 20 మిలియన్ లకు చేరడంతో ఆమె యాడ్‌ పోస్ట్‌ రేటు భారీగా పెరుగుతుందట. మార్కెట్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం చిన్న పోస్ట్‌ కు కూడా లక్షల రూపాయలు సమంతకు ముట్టనున్నాయట.

సమంత సోషల్‌ మీడియాలో అత్యధిక పాలోవర్స్ దక్కించుకున్న సౌత్‌ హీరోయిన్‌ గా నిలిచింది. ఈమె కంటే ముందు రష్మిక మందన్న నాలుగు మిలియన్‌ లు ఎక్కువ మంది ఫాలోవర్స్ ను కలిగి ఉంది. ఆ తర్వాత సమంత స్థానం ఉంటుంది అనడంలో సందేహం లేదు. సమంత బాడీ లాంగ్వేజ్‌ మరియు ఆమె నటన ఖచ్చితంగా బాలీవుడ్‌ లో సక్సెస్ ను తెచ్చి పెడుతుందని.. అందుకే బాలీవుడ్‌ లో ఆమెకు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ఈమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్దం అవుతుంది.. తమిళంలో విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో నటించిన సినిమా తో ఈమె ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్ లో తాప్సి బ్యానర్‌ లో ఒక సినిమాను మరియు ఇతర బ్యానర్‌ ల్లో రెండు సినిమాలను సమంత కమిట్‌ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు వెళ్లడవ్వాల్సి ఉంది.