Begin typing your search above and press return to search.

'నన్ను నేను మార్చుకోవాలి'.. చైతూ తో విడిపోయిన తర్వాత సామ్ ఫస్ట్ పోస్ట్..!

By:  Tupaki Desk   |   4 Oct 2021 9:43 AM GMT
నన్ను నేను మార్చుకోవాలి.. చైతూ తో విడిపోయిన తర్వాత సామ్ ఫస్ట్ పోస్ట్..!
X
టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య - సమంత తమ నాలుగేళ్ళ వివాహ బంధానికి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇద్దరు విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో.. కారణాలు ఏమయ్యుంటాయని అందరూ ఆరాలు తీయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం చై-సామ్ విడాకుల వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన 'చేంజ్ మై క్లోత్స్' అనే ఇంగ్లీష్ సాంగ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

''ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే నన్ను నేను మార్చుకోవాలి. నా పడక గదిని నేను సిద్ధం చేసుకోవాలి. ఇంటిని పరిశుభ్రం చేసుకోవాలి. మధ్యాహ్నం వరకూ నిద్రపోకూడదు. ఇక పగటి కలలు కనడం మానేసి.. చేయాల్సిన పనులపైనే దృష్టి పెట్టాలి'' అంటూ సాగే లిరిక్స్ ని సమంత తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది. నాగచైతన్య తో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సామ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన మొదటి పోస్ట్ ఇదే కావడంతో ప్రస్తుతం నెట్టింట్ వైరల్ గా మారింది.

చైతూ తో విడిపోయిన తర్వాత సమంత ఈ విధంగా ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందు తనని తాను మార్చుకుంటానని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే సమంత ఆ మధ్య సోషల్ మీడియా మాధ్యమాల్లో 'అక్కినేని' పేరును తొలగించి 'S' అనే ప్రొఫైల్ నేమ్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ‘S’ అక్షరాన్ని తొలగించి 'సమంత' గా మార్చేసింది.

కాగా, 'ఏమాయ చేసావో' సినిమాలో కలిసి నటించిన నాగచైతన్య - సమంత.. ప్రేమ వివాహం చేసుకొని రియల్ లైఫ్ లో కూడా ఒకటయ్యారు. అక్టోబర్ 7న హిందూ మరియు క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం డెస్టినేషన్ వెడ్డింగ్ చేసున్నారు. దశాబ్ద కాలం పాటు ప్రేమ.. నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు అక్టోబర్ 2న చై-సామ్ జంట అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.