Begin typing your search above and press return to search.

సమంతను ఛార్మినార్ కొండారెడ్డి బురుజు ఎక్కించిన ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   2 July 2020 2:20 PM IST
సమంతను ఛార్మినార్ కొండారెడ్డి బురుజు ఎక్కించిన ఫ్యాన్స్
X
మహమ్మారి వైరస్ కారణంగా సినీ ప్రముఖులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో సమంత ఎక్కువగా యోగాసనాలు చేస్తూ ఉంది. సినిమాల షూటింగ్స్ కు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టిన సమంత ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యింది. వైరస్ బారిన పడ్డాకుడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను యోగా ఆసనాలు చేస్తోంది. ఇటీవల ఆమె చేసిన యోగా ఆసనం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

తాజాగా కొందరు నెటీజన్స్ సమంత గాల్లో వేసిన ఆసనం పై మీమ్స్ చేస్తున్నారు. ఫోటో షాప్ లో కొందరు సమంత ఫోటోను ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా క్రియేటివిటీ తో ఫన్నీ గా క్రియేట్ చేస్తున్నారు. సమంత యోగ ఆసనం చార్మినార్ పై వేసినట్లుగా, మరొకరు కర్నూలు కొండారెడ్డి బురుజు పై ఉన్నట్లుగా మరొకరు మరో రకంగా సమంత ఆసనం వేసినట్లుగా చూపించారు. ఫోటోను తలకిందులు చేసి స్పైడర్ మ్యాన్ అంటూ కొందరు క్రియేట్ చేశారు. మొత్తానికి సమంత యోగ ఆసనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.