Begin typing your search above and press return to search.

కత్రినా కైఫ్ ను కాపీ కొడుతున్న సమంత..!

By:  Tupaki Desk   |   16 Dec 2021 2:30 AM GMT
కత్రినా కైఫ్ ను కాపీ కొడుతున్న సమంత..!
X
దక్షిణాది అగ్ర కథానాయికల్లో సమంత రూత్ ప్రభు ఒకరు. 'ఏమాయ చేసావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన సామ్.. గత పదేళ్లుగా ఇండీస్ట్రీలో రాణిస్తోంది. అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత కూడా క్రేజీ ఆఫర్స్ అందుకున్న సమంత.. ఇప్పుడు భర్తతో విడిపోయిన తరువాత కూడా తన హవా కొనసాగిస్తోంది.

విడాకుల ప్రకటన తర్వాత సమంత కెరీర్ మీద ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు సైన్ చేస్తూ వస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు తమిళ బైలింగ్విల్ చిత్రాలను ప్రకటించిన సామ్.. ఇటీవలే ‘యశోద’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభించింది. ఇదే క్రమంలో 'అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే ఇంటర్నేషనల్ మూవీ అనౌన్స్ చేసింది.

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తో ఉత్తరాదిన కూడా క్రేజ్ సంపాదించుకున్న సమంత.. ప్రస్తుతం ఓ హిందీ సినిమా కోసం చర్చలు జరుపుతోందని సమాచారం. త్వరలోనే స్టార్ హీరోయిన్ బాలీవుడ్ డెబ్యూ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. క్రీజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతూ దూకుడు మీదున్న సామ్.. ఉన్నట్టుండి ఐటమ్ సాంగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషనల్ తెరకెక్కిన 'పుష్ప: ది రైజ్' సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసింది. తన కెరీర్ లోనే ఐటెం నంబర్ లో ఆడిపాడటం ఆమెకు ఇదే తొలిసారి. 'ఊ అంటావా.. ఊఊ అంటావా' అనే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 45 మిలియన్లకు పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సమంత ప్రత్యేక గీతం గురించే మాట్లాడుకుంటున్నారు.

అయితే సామ్ కు అవసరం లేకపోయినా ఐటమ్ సాంగ్ చేయడానికి కారణం ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండాలనే కోరిక ఉండటం.. అలానే గ్లామరస్ గా కనిపించడానికి ఎలాంటి హద్దులు లేవని దర్శక నిర్మాతలకు తెలియజెప్పడానికే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ విషయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ను సమంత ఫాలో అవుతోందని అంటున్నారు.

కత్రినా కు ఐటెం సాంగ్స్ చేసిన తర్వాతే బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. తన బాయ్ ఫ్రెండ్స్ విడిపోయిన తర్వాత స్పెషల్ సాంగ్స్ తోనే లైమ్ లైట్ లో ఉంది. ఇదే క్రమంలో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. ఇప్పుడు భర్తతో విడిపోయిన సమంత కూడా కత్రినా కైఫ్ నే ఫాలో అవుతూ.. ప్రత్యేక గీతాలు చేస్తే లైమ్ లైట్ లో ఉండొచ్చనే ఉద్దేశ్యంతోనే 'ఊ అంటావా.. ఊఊ అంటావా' పాటలో నర్తించడానికి రెడీ అయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి కత్రినా మాదిరిగానే సామ్ కు బాలీవుడ్ ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.