Begin typing your search above and press return to search.

నిదుర క‌ళ్లు.. మత్తు క‌ళ్లు.. ఏది నిజం సామ్?

By:  Tupaki Desk   |   15 Dec 2021 8:30 AM GMT
నిదుర క‌ళ్లు.. మత్తు క‌ళ్లు.. ఏది నిజం సామ్?
X
ఇటీవ‌లే క‌డ‌ప‌లో ద‌ర్గాని సంద‌ర్శించి అటుపై తిరుమ‌లేశుని స‌న్నిధానంలో సేద దీరి చివ‌రికి ప‌ర్య‌ట‌న‌ను ముగించి హైద‌రాబాద్ చేరుకుంది స‌మంత‌. అయితే ప్ర‌యాణ బ‌డ‌లిక తో ఇంత‌లోనే సామ్ పూర్తిగా సుప్తావ‌స్థ‌లోకి వెళ్లింద‌ట‌.

అయితే స‌మంత‌కు ఏదో అయ్యింది.. త‌న‌కు జ్వ‌రం వ‌చ్చింది కాబ‌ట్టి క‌రోనా అయ్యుంటుంది! అంటూ ఒక‌టే ప్ర‌చారం సాగింది. కానీ ఇంత‌లోనే సామ్ త‌నకు ఏదీ లేద‌ని ఆరోగ్యంగా ఉన్నాన‌ని క్లారిటీనిచ్చారు.

తాజాగా స్లీపీ క‌ళ్ల‌తో స్లీపీ సెల్ఫీని షేర్ చేసి మ‌రింత‌గా క్లారిటీనిచ్చింది. తన అభిమానులందరికీ రిలీఫ్ నిస్తూ.. సమంత తన సుదీర్ఘ నిద్ర గురించి వెల్లడించింది. మంచంపై నుండి నేరుగా సెల్ఫీని పంచుకుంది. సాయంత్రం ఆలస్యంగా మేల్కొన్నాన‌ని సామ్ తెలిపింది. ``రోజంతా నిద్రపోయి ఇప్పుడు రాత్రి 9 గంటలకు మేల్కొని ఉన్నాను`` అని పోస్ట్ చేసింది. ఈ ఫోటోతో ఆందోళన చెందుతున్న అభిమానులందరికీ తగినంత ఉపశమనం దొరికింది. సామ్ విశాలమైన కళ్ళు .. అందమైన చిరునవ్వు వారిని సంతోషంగా నిద్రపోయేలా చేసింది. ఆమె కడప పర్యటన నుండి తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఇంత‌గా రెస్ట్ తీసుకోవాల్సొచ్చింది.

`పుష్ప-ది రైజ్` చిత్రంలో స‌మంత `ఊ అంటావా..` పాట ఇప్ప‌టికే సంచ‌ల‌నంగా మారింది. ఈ పాట వివాదాల్ని మోసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. సామ్ కెరీర్ లోనే హాటెస్ట్ సాంగ్ ఇద‌ని అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు.