Begin typing your search above and press return to search.

పుకార్లను పట్టించుకోకుండా మాన్ సూన్ ని ఎంజాయ్ చేస్తున్న సామ్..!

By:  Tupaki Desk   |   31 Aug 2021 7:41 AM GMT
పుకార్లను పట్టించుకోకుండా మాన్ సూన్ ని ఎంజాయ్ చేస్తున్న సామ్..!
X
టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య - సమంత గత కొన్ని రోజులుగా ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ మారారు. అన్యోన్యమైన దాంపత్య జీవితం కొనసాగిస్తున్న చై-సామ్ మధ్య మనస్పర్థలు వచ్చాయని.. వారి కాపురం ఇప్పుడు సజావుగా లేదని రూమర్స్ వినిపిస్తున్నాయి. సమంత సోషల్ మీడియా మధ్యమాలలో తన ప్రొఫైల్ నేమ్ లో 'అక్కినేని' ని తొలగించడంతో మొదలైన ఈ పుకార్లు.. ఇంకా నడుస్తూనే ఉన్నాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సామ్ మాట్లాడుతూ.. ప్రొఫైల్ పేరు మార్చడంపై వస్తున్న వార్తలపై స్పందించాలని అనుకోవడం లేదని.. అలాంటి విషయాలపై నాకు మాట్లాడాలనిపిస్తేనే మాట్లాడతానని చెప్పుకొచ్చింది. అంతేకాదు కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నానని.. అందుకే కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయలేదని సమంత తెలిపింది. దీంతో సోషల్ మీడియాలో మరిన్ని ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో అక్కినేని కోడలు ఈ విషయంపై వీలైనంత త్వరగా స్పందించి రూమర్స్ కు చెక్ పెట్టాలని అభిమానులు భావిస్తున్నారు. అయితే సమంత మాత్రం తన గురించి వస్తున్న వార్తలను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. సోమవారం సామ్ తన ఫెండ్స్ తో కలిసి మాన్ సూన్ సీజన్ ను ఎంజాయ్ చేయడానికి ట్రిప్ కు వెళ్ళింది. 'ఈరోజు అడ్వెంచర్' అంటూ శిల్పారెడ్డి కొడుకుతో కలిసి ఓ ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 'బీ వండర్ ఫుల్' అని బెడ్ మీద ఉన్న మరో ఫోటో పోస్ట్ చేసింది.

అలానే ట్రోల్స్ ని పట్టించుకొద్దంటూ ఓ రచయిత పోస్ట్ చేసిన కొటేషన్ ను సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ట్రోల్స్ పై స్పందించడం కంటే వాటిని ఇగ్నోర్ చేయడం మంచిదనే విధంగా ఈ కొటేషన్ ఉంది. దీనిని బట్టి తన తన వైవాహిక జీవితం మీద వస్తున్న వార్తలపై సామ్ స్పందించకూడదని నిర్ణయించుకుందని అర్థం అవుతోంది.

సమంత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. అలానే తమిళ్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి - నయనతార లతో కలిసి ఓ సినిమా చేస్తోంది. కొంతకాలం బ్రేక్ తీసుకొని తదుపరి ప్రాజెక్ట్స్ కు అంగీకరించాలి సామ్ నిర్ణయించుకున్నారు.