Begin typing your search above and press return to search.

సల్మాన్ ఖాన్.. గ్యాంగ్‌స్టర్ నుంచి మరో హెచ్చరిక

By:  Tupaki Desk   |   12 July 2022 12:30 PM GMT
సల్మాన్ ఖాన్.. గ్యాంగ్‌స్టర్ నుంచి మరో హెచ్చరిక
X
సినిమా ప్రపంచంలో సినిమా తారలకు ఏదో ఒక విషయంలో అజ్ఞాత వ్యక్తుల నుంచి పలు బెదిరింపులు రావడం సహజమే. ఇక బాలీవుడ్ ఇండస్ట్రిలో చాలా కాలంగా ఈ తరహా ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. అందులో ఎక్కువగా సల్మాన్ ఖాన్ కు సంబంధించిన వివాదాస్పద విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఆ మధ్యకాలంలో సల్మాన్ ఖాన్ కు ఒక వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

సల్మాన్ ఖాన్ తో పాటు అతని తండ్రిని కూడా చంపేస్తామంటూ తీవ్రస్థాయిలో ఒక లేఖ ద్వారా తెలియజేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఆ బెదిరింపులపై సల్మాన్ ఖాన్ పర్సనల్ లాయర్ కూడా ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. ఈ క్రమంలో ముంబై పోలీసులు రంగంలోకి దిగగా, జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపులకు కారణమని చెప్పారు.

ఇప్పుడు, తాజా నివేదికల ప్రకారం, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మరో హెచ్చరికను పంపినట్లు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ వెల్లడించింది. జూలై 10న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కృష్ణజింక ఘటనలో సల్మాన్ ఖాన్‌ను తన సంఘంతో పాటు తాను కూడా ఎప్పటికీ క్షమించబోనని హెచ్చరించినట్లు సమాచారం.

సల్మాన్ ఖాన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పిన తర్వాతే లారెన్స్ బిష్ణోయ్ తన నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తానని హెచ్చరిక చేసినట్లు స్పెషల్ సెల్ తెలిపింది.

అయితే ఈ విషయంలో కూడా సల్మాన్ ఖాన్ వ్యక్తిగత లాయర్ మరోసారి పోలీస్ అధికారులతో చర్చలు జర్నట్లు సమాచారం. ఈ బెదిరింపుల సమయంలో ఇటీవల సల్మాన్ ఈద్ సందర్భంగా ఫ్యాన్స్ ను కలిసేందుకు బయటకు కూడా రాలేదు. మరోవైపు సల్మాన్ ఖాన్ వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ రెండు సినిమాలు ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ముందుగా టైగర్ 3 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. అలాగే కభీ ఈద్ కభీ దీవాలి అనే సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలుపెట్టాలని ప్రణాళికలు రచిస్తున్నాడు. ఆ సినిమాలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నారు.