Begin typing your search above and press return to search.

కంచి ప‌ట్టు చీర‌లో సింగారాయ్ స‌ఖియ‌

By:  Tupaki Desk   |   15 Dec 2021 8:30 AM GMT
కంచి ప‌ట్టు చీర‌లో సింగారాయ్ స‌ఖియ‌
X
ఇటీవ‌ల కాంజీవ‌రం ప‌ట్టు చీర‌ల‌కు డిమాండ్ ఊపందుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఇంత‌కుముందు దీపిక ప‌దుకొనే.. స‌మంత కూడా కాంజీవ‌రం చీర‌లో హొయ‌లు పోయిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. ప‌ట్టు చీర‌లో అంద‌గ‌త్తెల హ‌వా ఏ రేంజులో ఉంటుందో యూత్ కి అర్థ‌మైంది.

ఇప్పుడు శ్యామ్ సింఘ‌రాయ్ ప్ర‌మోష‌న‌ల్ వేడుక సాక్షిగా సాయిప‌ల్ల‌వి కూడా కాంజీవ‌రం కంచి ప‌ట్టు చీర‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. పింక్ అండ్ రోజ్ గోల్డ్ క‌ల‌ర్ లో డిజైన్ చేసిన ఈ చీర‌లో ఎంతో సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపిస్తోంది సాయిప‌ల్ల‌వి. అలా ఈవెంట్ ఆద్యంతం ఎంతో సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌తో క‌నిపించింది.

ఈవెంట్ లో కుర్రాళ్లంతా సాయిప‌ల్ల‌వి నే టార్గెట్ చేస్తూ ఛీర‌ప్ అయ్యారంటే అతిశ‌యోక్తి కాదు. శ్యామ్ సింగ‌రాయ్ వేదిక‌పై సాయిప‌ల్ల‌వి మాట్లాడుతూ..శ్యామ్ సింగ రాయ్ ఓ విజువల్ ట్రీట్‌లా ఉంటుంద‌ని అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ రెండు ప్రపంచాలను చూపించారు. వాసు- శ్యామ్ సింగ రాయ్ రెండు ప్రపంచాలని అద్బుతంగా చూపించారు. కెమెరామెన్- క్యాస్టూమ్ డిజైనర్ పడ్డ కష్టాన్ని ప్రేక్షకులు థియేటర్లో చూడాల్సిందేన‌ని అన్నారు.

శ్యామ్ సింగ రాయ్ సినిమా నాని ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ లా ఉంటుంది. ఇది వరకు ఎన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు.. సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని నిర్మాత గారు అనుకున్నారు.. అలానే చేస్తున్నారు అని సాయిప‌ల్ల‌వి అన్నారు.