Begin typing your search above and press return to search.

మెగా క‌జిన్స్ ఓ చోట చేరి రేతిరంతా మంత‌నాలు!

By:  Tupaki Desk   |   27 Jun 2021 4:30 PM GMT
మెగా క‌జిన్స్ ఓ చోట చేరి రేతిరంతా మంత‌నాలు!
X
మెగా యువ హీరోలంతా ఓ చోట చేరితే సంద‌డే సంద‌డి. ఇంత‌కుముందు మెగా హీరోలంతా సెల‌బ్రేష‌న్ మోడ్ లో ఉన్న ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. పార్టీలు ఫంక్ష‌న్ల‌లో క‌లుసుకోవ‌డం మామూలే కానీ తాజాగా ఓ రేర్ క్లిక్ వైర‌ల్ గా మారింది. ఈ సెల్ఫీలో వరుణ్ తేజ్- సాయి ధరమ్ తేజ్- వైష్ణవ్ తేజ్ ముగ్గురూ ఒకే పానుపుపై నిదురిస్తూ క‌నిపించారు.

సెకండ్ వేవ్ స‌మ‌యంలో మెగా క‌జిన్స్ అంతా ఓచోట చేరి ఇలా స‌ర‌దాగా టైమ్ స్పెండ్ చేస్తున్నారో ఏమో కానీ..! ఈ సెల్ఫీ మాత్రం అభిమానుల్లో వైర‌ల్ గా దూసుకెళుతోంది. ఓచోట చేరి ఏం మంత‌నాలు సాగిస్తున్నారో కానీ విలువైన స‌మ‌యాన్ని ఈ లాక్ డౌన్ ఇచ్చింద‌నే చెప్పాలి.

ప్ర‌స్తుతం ఆ ముగ్గురూ కెరీర్ ప‌రంగా ఫుల్ బిజీగా ఉన్నారు. వ‌రుణ్ తేజ్ గ‌ని చిత్రంలో న‌టిస్తుండ‌గా.. సాయి తేజ్ న‌టించిన రిప‌బ్లిక్ రిలీజ్ కి రావాల్సి ఉంది. ఉప్పెన లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత వైష్ణ‌వ్ తేజ్ కెరీర్ ప‌రంగా క్ష‌ణం తీరిక లేనంత బిజీ అయ్యారు.