Begin typing your search above and press return to search.

థ‌ర్టీప్ల‌స్ దాటాకే క్రేజీ హీరోయిన్ పెళ్లంట

By:  Tupaki Desk   |   7 Jan 2022 12:30 AM GMT
థ‌ర్టీప్ల‌స్ దాటాకే క్రేజీ హీరోయిన్ పెళ్లంట
X
మ‌న ప‌క్కింటి అమ్మాయిలా వుందే అని ప్ర‌తీ ఆడియ‌న్ ఫీల‌య్యేలా త‌నదైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటోంది సాయి ప‌ల్ల‌వి. మల‌యాళ మూవీ `ప్రేమ‌మ్‌`లో మ‌ల‌ర్‌గా మెస్మ‌రైజ్ చేసిన సాయి ప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌కుల్ని కూడా `ఫిదా` చేసిన విష‌యం తెలిసిందే. స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటూ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌ర‌చుకుంది. తెలుగులో ఆమె చేస్తున్న చిత్రాలు వ‌రుస‌గా సూప‌ర్ హిట్ లుగా నిలుస్తున్నాయి.

`ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` త‌ప్ప తెలుగులో సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాల‌న్నీ సూప‌ర్ హిట్ లే. రీసెంట్ గా ల‌వ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ చిత్రాల‌తో మ‌రోసారి వ‌రుస విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకుంది. నానితో గ‌తంలో `ఎంసీఏ` చేసిన సాయి ప‌ల్ల‌వి తాజాగా `శ్యామ్ సింగ రాయ్‌`తో ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేసింది. టైమ్ ట్రావెల్ క‌థ‌గా పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ గ‌త ఏడాది డిసెంబ‌ర్ 24న విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద నాలుగు భాష‌ల్లో అనూహ్య విజ‌యాన్ని సాధిస్తోంది.

ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి రోజీగా దేవ‌దాసీ పాత్ర‌లో న‌టించి మెప్పించింది. అచ్చం బెంగాళీ యువ‌తిగా క‌నిపించి మెస్మ‌రైజ్ చేసింది. ఈ సంద‌ర్భంగా త‌న పాత్ర‌కు ల‌భిస్తున్న ప్ర‌శంస‌ల‌తో పాటు సినిమా స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సాయి ప‌ల్ల‌వి తాజాగా త‌న పెళ్లి ఎప్పుడో చెప్పేసింది. సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీగా వున్న సాయి ప‌ల్ల‌వి వ‌రుస‌గా ప‌లు మీడియా సంస్థ‌ల‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇస్తోంది.

ఈ సంద‌ర్భంగా ఆమెని పెళ్లి గురించి ప్ర‌శ్నించారు. అయితే ఈ ప్ర‌శ్న‌కు త‌న‌దైన స్టైల్లో స్పందించింది. ఇంకా త‌న వ‌య‌సు 29నే అని, 30 ఏళ్ల త‌రువాతే తాను పెళ్లి గురించి ఆలోచిస్తాన‌ని స్ప‌ష్టం చేసింది. అంటే సాయి ప‌ల్ల‌వి థ‌ర్టీ ప్ల‌స్ వ‌చ్చేంత‌ వ‌ర‌కు తాను పెళ్లి చేసుకోన‌ని చెప్పింద‌న్న‌మాట‌. ఈ విష‌యం తెలిసి ఆమె అభిమానులు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

సాయిప‌ల్ల‌వి అప్పుడే పెళ్లి చేసుకుని సినిమాల‌కు ఫుల్ స్టాప్ పెట్టేస్తే మా ప‌రిస్థితి ఏంట‌ని, అందుకే ఆమె ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకోన‌ని చెప్ప‌డం మాకు ఆనందాన్ని క‌లిగిస్తోంద‌ని చెబుతున్నారు.