Begin typing your search above and press return to search.

ఏపీలో టికెట్ ధరలను సులభ్ కాంప్లెక్స్ రేట్లతో పోల్చిన స్టార్ రైటర్..!

By:  Tupaki Desk   |   8 Jan 2022 5:33 AM GMT
ఏపీలో టికెట్ ధరలను సులభ్ కాంప్లెక్స్ రేట్లతో పోల్చిన స్టార్ రైటర్..!
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ ధరల వ్యవహారంలో ప్రభుత్వానికి సినీ ప్రముఖుల మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రజలకు తక్కువ రేట్లకే సినిమా వినోదాన్ని అందించడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతుంటే.. టికెట్ రేట్ల తగ్గింపు వల్ల తీవ్ర నష్టాలు తప్పవని సినీ పెద్దలు అంటున్నారు. ఇప్పటికే పలువురు ఏపీ సర్కారు నిర్ణయాన్ని బాహాటంగా విమర్శించగా.. మరికొందరు తమదైన శైలిలో విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

సాయి మాధవ్ బుర్రా ఇటీవల ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రోమో విడుదలైంది. ఇందులో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి.. అలాగే తన జీవితంలో సినిమాకి ఉన్న ప్రాధాన్యత గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల అంశం మీద రచయిత తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ''సులభ్ కాంప్లెక్స్ లోపలికి వెళ్లడానికి పెట్టే డబ్బులతో సినిమా థియేటర్లోనికి వెళ్లడమనేది చాలా బాధాకరమైన విషయం'' అని సాయి మాధవ్ అన్నారు.

నచ్చకపోతే ఎలాంటి అంశం మీదైనా ఓపెన్ గా స్పందిస్తానని.. అలాంటప్పుడు తనలోని కమ్యూనిస్టు ఎప్పుడూ బయటకు వస్తుంటాడని సాయి మాధవ్ పేర్కొన్నారు. అలానే ‘బాహుబలి’ చిత్రానికి డైలాగ్స్ రాసే అవకాశం చేజారిన విషయాన్ని కూడా రచయిత వెల్లడించారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. సాయి మాధవ్ బుర్రా ప్రస్తుతం తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్స్ కు సంభాషణలు అందిస్తూ తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నారు. రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' సినిమాకు డైలాగ్స్ రాసిన సాయి.. పవన్ కళ్యాణ్ చేస్తున్న 'హరి హర వీరమల్లు' - రామ్ చరణ్-శంకర్ కాంబోలో రూపొందే '#RC15' మరియు ప్రభాస్ నటిస్తున్న 'ప్రాజెక్ట్ K' వంటి క్రేజీ పాన్ ఇండియా చిత్రాలకు వర్క్ చేస్తున్నారు. అలానే రామ్ '#RAPO19' - బాలకృష్ణ '#NBK107' వంటి మరికొన్ని సినిమాలు సైరా డైలాగ్ రచయిత చేతిలో ఉన్నాయి.