Begin typing your search above and press return to search.

ఒళ్లు దగ్గర పెట్టుకుని శాతకర్ణికి రాశా

By:  Tupaki Desk   |   19 Dec 2016 5:02 AM GMT
ఒళ్లు దగ్గర పెట్టుకుని శాతకర్ణికి రాశా
X
బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి కోసం పని చేయడాన్ని.. ప్రతీ ఒక్కరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆస్వాదిస్తున్నారు. దర్శకుడు క్రిష్ ఇప్పటికే ఈ విషయాన్ని పలు మార్లు చెప్పగా.. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా.. డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

' నేను గుంటూరు తెనాలి లో పుట్టా. బతువుతెరువు కోసం హైద్రాబాద్ లో పెరిగా. కానీ బతుకంగా గుర్తుండిపోయే పుట్టిన రోజు కరీంనగర్ లో జరుగుతుందని అనుకోలేదు. బాలకృష్ణగారి సినిమాకి రాయాలని అని క్రిష్ చెప్పినపుడు.. నేను నమ్మలేకపోయా.. నేను రాస్తోంది ఒక సినిమాకి కాదు.. ఒకేసారి వంద సినిమాలకు రాస్తున్నా అని భావించా. కోట్ల మంది అభిమానుల ఆశలకు నేను డైలాగ్స్ రాస్తున్నాను. ప్రతీ తెలుగువారు గౌతమిపుత్ర శాతకర్ణిపై పెట్టుకున్న ఆశలకు నమ్మకాలకు నేను డైలాగ్స్ రాస్తున్నాను. గుర్తు పెట్టుకుని ఒళ్లు దగ్గర పెట్టుని భయభక్తులతో ప్రతీ అక్షరం రాయడానికి ప్రయత్నించాను' అంటూ చెప్పాడు సాయి మాధవ్.

'ఇది నా మార్గదర్శి క్రిష్ నాకు ఇచ్చిన కానుక. నేను సీనియర్ ఎన్టీఆర్ పిచ్చిలో బతికాను. నా రక్తంలో అభిమానం అణువణువు ప్రసరిస్తూ ఉంటుంది. నేను ఆయన భక్తుడిని. ఆయనకు రాసే అవకాశం రాదు. బాలకృష్ణకి రాసినపుడు.. ఆయన చెబుతుంటే.. రామారావు గారు మాట్లాడుతున్నట్లే ఉంది. నాకు చాలా సార్లు కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. ఈ అవకాశం నాకిచ్చిన యూనిట్ అందరికీ కృతజ్ఞతలు. ప్రతీ తెలుగువాడు సగర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది గౌతమిపుత్ర శాతకర్ణి' అంటూ ముగించాడు శాతకర్ణి మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/