Begin typing your search above and press return to search.

మెగా మేనల్లుడి 'రిపబ్లిక్' సెన్సార్ పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే..?

By:  Tupaki Desk   |   18 Sep 2021 4:39 PM GMT
మెగా మేనల్లుడి రిపబ్లిక్ సెన్సార్ పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే..?
X
మెగా మేనల్లుడు సాయి తేజ్ - 'ప్రస్థానం' ఫేమ్ దేవకట్టా కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం ''రిపబ్లిక్''. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ - జె.పుల్లారావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారు.

'రిపబ్లిక్' చిత్రానికి సెన్సార్ బోర్డ్ వారు 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర బృందం సాయి తేజ్ సరికొత్త పోస్టర్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో పొలిటికల్ సిస్టమ్ కు ఎదురెళ్లే ఐఏఎస్ ఆఫీసర్ పంజా అభిరామ్ పాత్రలో తేజ్ కనిపించనున్నారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ - జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన 'రిపబ్లిక్' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ - టీజ‌ర్‌ - రెండు పాటలకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఎమ్ సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

కరోనా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ తర్వాత 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేసిన సాయి తేజ్.. ఇప్పుడు సెకండ్ వేవ్ పరిస్థితుల అనంతరం ''రిపబ్లిక్'' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరో రెండు వారాల్లో థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సాయి తేజ్ ఏ మేరకు ప్రమోషన్స్ చేస్తారో చూడాలి.