Begin typing your search above and press return to search.

తేజ్‌ హెల్త్ అప్‌డేట్‌ : ఇంకో రెండు నెలలు...!

By:  Tupaki Desk   |   8 Oct 2021 12:41 PM GMT
తేజ్‌ హెల్త్ అప్‌డేట్‌ : ఇంకో రెండు నెలలు...!
X
మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కు బైక్‌ యాక్సిడెంట్ లో గాయాలయ్యాయి. యాక్సిడెంట్ సమయంలో హెల్మెట్‌ పెట్టుకుని ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. తేజ్‌ కోలుకుంటున్నా అంటూ ఇటీవలే ట్వీట్‌ పెట్టాడు. తాజాగా నాగబాబు మాట్లాడుతూ సాయి ధరమ్‌ తేజ్ కోలుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన చికిత్సలు ఇంకా కొనసాగుతున్నాయి. 30 నుండి 40 రోజుల్లో పూర్తిగా అతడు కోలుకుంటాడనే నమ్మకంను వ్యక్తం చేయడం జరిగింది. అతడు రెండు నెలల్లో మళ్లీ షూటింగ్ లకు హాజరు అవ్వాలని ఎదురు చూస్తున్నాడు. మేము మాత్రం మరి కొంత కాలం విశ్రాంతి తీసుకోమని చెబుతున్నాం. మొత్తానికి సాయి ధరమ్‌ తేజ్‌ చాలా స్పీడ్‌ గా రికవరీ అవుతున్నాడని నాగబాబు చెప్పుకొచ్చాడు.

పవన్ కళ్యాణ్‌ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ సాయి ధరమ్‌ తేజ్ ఇంకా కళ్లు తెరవని పరిస్థితిలో ఉన్నాడు అంటూ ప్లో లో మాట్లాడాడు. అప్పటి నుండి మెగా ఫ్యాన్స్‌ లో ఒక రకమైన ఆందోళన మొదలు అయ్యింది. చిన్న యాక్సిడెంట్ అన్నారు.. ఇన్ని రోజులు ఎందుకు తేజ్ కనిపించడం లేదు అంటూ పదే పదే సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఎట్టకేలకు నాగబాబు కూడా అల్లుడు ఆరోగ్యం గురించి స్పందించాడు. రిపబ్లిక్ మూవీ కి వచ్చిన రెస్పాన్స్ కు తేజ్ హ్యాపీగా ఉన్నాడని.. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత సినిమా సక్సెస్‌ ను సన్నిహితులతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

మెగా హీరోలు అంతా కూడా సాయి ధరమ్‌ తేజ్ కోసం మద్దతుగా నిలిచారు. ఆయన సినిమా విడుదల సమయంలో అయితే ఏంటీ .. ఆయన హెల్త్‌ విషయంలో మీడియాలో ఇష్టానుసారంగా కథనాలు వచ్చినప్పుడు కూడా తమదైన శైలిలో స్పందించారు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్‌ అంతా కూడా సాయి ధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ వార్తలకు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు తేజ్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లుగా నాగబాబు ప్రకటించడం.. రెండు నెలల్లో షూటింగ్‌ లకు కూడా హాజరు అయ్యేందుకు ఆసక్తిగా ఉన్నందుకు గాను అభిమానులు రిలాక్స్ అయ్యారు. తేజ్‌ ను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఒక వైపు ఫిజియో థెరఫీ చేస్తూనే మరో వైపు ఫిజిక్ కోసం తేజ్ వర్కౌట్లు కూడా చేసి రెండు నెలల్లో పూర్తిగా నార్మల్‌ అయ్యి ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తాను అనే నమ్మకంను జనాలు వ్యక్తం చేస్తున్నారు.