Begin typing your search above and press return to search.

ట్యాగ్‌ చేసి బ్రేకప్ పుకార్లకు చెక్‌ పెట్టేశాడు

By:  Tupaki Desk   |   1 Aug 2022 6:31 AM GMT
ట్యాగ్‌ చేసి బ్రేకప్ పుకార్లకు చెక్‌ పెట్టేశాడు
X
బాలీవుడ్‌ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్‌ మరియు దిశా పటానీ బ్రేకప్‌ వార్తలు గత వారం రోజులుగా జాతీయ మీడియా నుండి మొదలుకుని స్థానిక మీడియా.. సోషల్‌ మీడియా వరకు సందడి చేస్తోంది. మొన్నటి వరకు ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట అనూహ్యంగా ఎందుకు బ్రేకప్ అవ్వాల్సి వచ్చింది అనేది ఇప్పుడు టాక్‌. ఇండస్ట్రీ లో ఈ జంట గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి.

టైగర్ ష్రాఫ్‌ మరియు దిశా కుటుంబ సభ్యులను కూడా ఈ విషయంలో ప్రశ్నించేందుకు మీడియా ప్రయత్నించింది. కాని ఏ ఒక్కరు కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పైగా పెళ్లి చేసుకోవాలని దిశా ఒత్తిడి చేయడం వల్లే టైగర్‌ బ్రేకప్ చెప్పాడు అంటూ కూడా జాతీయ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. ఆ పుకార్ల పై తాజాగా స్వయంగా టైగర్‌ ష్రాఫ్‌ క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాడు.

బ్రేకప్ తర్వాత ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం.. ఒకరి పోస్ట్‌ లు ఒకరు డిలీట్‌ చేయడం... సోషల్‌ మీడియాలో అన్‌ ఫాలో అవ్వడం చేస్తారు. కాని అందుకు విరుద్దంగా సోషల్‌ మీడియాలో టైగర్‌ ష్రాఫ్‌ వ్యవహరించడంతో వీరిద్దరు బ్రేకప్ అవ్వలేదు అనే క్లారిటీ దాదాపుగా వచ్చినట్లే అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇంతకు టైగర్ చేసిన పోస్ట్‌ ఏంటీ అంటే... దిశా పటానీ తాజా చిత్రం ఏక్‌ విలన్ రిటర్న్‌ ను ప్రమోట్‌ చేయడం తో పాటు దిశా పటానీని ట్యాగ్‌ చేశాడు. బ్రేకప్ అయిన జంట అయితే ఖచ్చితంగా ఇలాంటి ఒక పోస్ట్‌ టైగర్ ష్రాఫ్ నుండి వచ్చి ఉండేది కాదని... టైగర్‌ తమ లవ్ ఇంకా కొనసాగుతుందని ఈ పోస్ట్‌ తో.. ట్యాగ్‌ తో క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది.

బాలీవుడ్ తో పాటు సౌత్‌ లో కూడా ఈ ప్రేమ జంట యొక్క హంగామా కనిపిస్తూ ఉంటుంది. వీరిద్దరు సోషల్‌ మీడియాలో చాలా పాపులర్‌.. ఇద్దరిని కూడా సౌత్‌ లో చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. అందుకే వీరి బ్రేకప్ వార్తలు వచ్చినప్పుడు.. తాజాగా టైగర్‌ ష్రాఫ్‌ పోస్ట్‌ ఇలా అన్ని సోషల్‌ మీడియా ద్వారా చర్చనీయాంశం అయ్యాయి.

పుకార్లకు టైగర్ చెక్ పెట్టినా కూడా నూరు శాతం క్లారిటీ రాలేదని ఇంకా కొందరు బ్రేకప్ నిజమే అయ్యి ఉంటుంది అంటూ అనుమానంతోనే ఉన్నారు.