Begin typing your search above and press return to search.

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు.. ఆ హీరోయిన్ కు క్లీన్ చిట్

By:  Tupaki Desk   |   17 Sep 2022 12:30 PM GMT
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు.. ఆ హీరోయిన్ కు క్లీన్ చిట్
X
రూ.215 కోట్ల సుకేష్ చంద్రశేఖర్ స్కాంలో బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహిను విచారించిన అధికారులు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ భారీ కేసు నుంచి బయటపడ్డ హీరోయిన్ ఊపిరిపీల్చుకుంది. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడిన వ్యవహారంలో కరుడుగట్టిన ఆర్ధిక నేరస్థుడు సుకేష్ చంద్రశేఖర్ కేసులో ఈమెను పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఛార్జీ షీట్ దాఖలు కాగా.. నోరా ఫతేహిని విచారించిన అనంతరం ఈమె ప్రమేయం లేదని తేల్చారు.

అక్రమ ఆర్థిక లావాదేవీల ఆరోపణలు ఎదుర్కొన్న నోరా ఫతేహిని పోలీసులు విచారించారు. సుకేష్ చంద్రశేఖర్ కు సంబంధించి 200 కోట్ల బలవంతపు వసూళ్ల కుంభకోణంలో ఢిల్లీకి చెందిన ఆర్థిక నేరాల విభాగానికి చెందిన అధికారులు నోరా ఫతేహిని పలు రకాలుగా విచారించారు.నోరా ఫతేహిని 50 ప్రశ్నల వరకూ అధికారులు అడిగారు. ఆమెకు ఎలాంటి బహుమతులు వచ్చాయి? ఎవరితో మాట్లాడింది? వారిని ఎక్కడ కలిశారన్నది పోలీసులు అడిగినట్లు తెలుస్తోంది.

ఈ విచారణలో తనకు సుఖేష్ గర్ల్ ఫ్రెండ్ అయిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో సంబంధాలు లేవని.. తాను సుకేష్ తో విడిగానే మాట్లాడినట్టు వెల్లడించింది. నెయిల్ ఆర్ట్ ఫంక్షన్ కోసం అతడి భార్య తనతో మాట్లాడిందని.. ఆపై తరచూ తనకు ఫోన్ చేసేదని ఆమె తెలిపారు. వారు ఆమెకు బీఎండబ్ల్యూ , ఇతర కార్లు బహుమతిగా ఇచ్చారని వెల్లడించారు. అతడి నేరనేపథ్యం తనకు తెలియదని నోరా ఫతేహి పోలీసులకు తెలిపింది. సుకేష్ తన మేనేజర్, కజిన్ తో ఎక్కువగా మాట్లాడేవాడని చెప్పింది.

ఈ క్రమంలోనే రూ.200 కోట్ల కుంభకోణంలో హీరోయిన్ నోరా ఫతేహికి ఢిల్లీ పోలీసుల ఆర్ధిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ చుట్టూ జరిగిన కుట్రలో నోరా ప్రమేయం లేదని.. క్రైమ్ సిండికేట్ గురించి ఆమెకు తెలియదని పోలీసులు తెలిపారు.

రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ లు జైళ్లో ఉన్న సమయంలో వారికి బెయిల్ ఇప్పిస్తానని చెప్పాడు చంద్రశేఖర్. కేంద్ర న్యాయ శాఖలోని ఉన్నతాధికారిగా వారి భార్యలను కలిసి బెయిల్ ఇప్పిస్తానని, అందుకు రూ. 200 కోట్ల ఖర్చవుతుందని చెప్పాడు. దీంతో చంద్రశేఖర్ ను నమ్మిన వారు రూ. 200 కోట్లు అప్పజెప్పారు. ఆ తరువాత వారికి సుకేశ్ కనిపించలేదు. ఈ డబ్బుతో చెన్నైలోని ఓ బంగ్లా ను కొన్నట్లు వారు పేర్కొన్నారు.

సుకేష్ కేసులో బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఇటు నోరా ఫతేహిలను ప్రశ్నించారు. తాజాగా నోరాకు క్లీన్ చిట్ఇచ్చారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.