Begin typing your search above and press return to search.

44 నిమిషాల‌కు రూ.17 కోట్లా... మాస్ మ‌హారాజానా మ‌జాకానా!

By:  Tupaki Desk   |   28 Dec 2022 12:30 PM GMT
44 నిమిషాల‌కు రూ.17 కోట్లా... మాస్ మ‌హారాజానా మ‌జాకానా!
X
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న వాల్తేరు వీర‌య్య‌లో మాస్ మహారాజ ర‌వితేజ కూడా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు లీక‌వుతూ సినిమాపైన అంచ‌నాలు పెంచేస్తున్నాయి.

ఈ సినిమాలో మాస్ మ‌హారాజా 44 నిమిషాల‌సేపు తెర‌పైన క‌నిపిస్తార‌ట‌. ఇందుకోసం ర‌వితేజ సినిమా నిర్మాత‌లు రూ.17 కోట్లు పారితోషికం చెల్లించాల‌ని నెట్టింట రూమ‌ర్లు చక్క‌ర్లు కొడుతున్నాయి. నిజానికి రవితేజ తాను న‌టించే సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటార‌నేది అధికారికంగా ఎక్క‌డ చెప్పింది లేదు. ఆయ‌నే కాదు ఏ హీరో కూడా చెప్ప‌రు.

అయితే బ‌య‌ట ప్ర‌చారాలు మాత్రం ఆ న‌టుడు ఇంత ఆ న‌టి ఇంత తీసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంటుంది. అలాగే ఇప్పుడు ర‌వితేజ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో న‌టిస్తుండ‌టంతో ఆ సినిమాపైన అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. గ‌తంలోనూ చిరంజీవితో క‌లిసి ర‌వితేజ కొన్ని సినిమాల్లో న‌టించిన విష‌యం తెలిసిందే.

ఈ సినిమాలో ర‌వితేజ‌ది ఒక ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్. ఈ సినిమాకు కూడా త‌న మామూలు సినిమాల‌కు అడుగుతున్న‌ట్లుగానే రూ.18 కోట్లు పారితోషికం డిమాండ్ చేశార‌ట ర‌వితేజ‌. అయితే సినిమా నిర్మాత‌లు రూ.12 కోట్ల నుంచీ బేర‌సారాలు సాగించార‌ట‌. చివ‌ర‌కు ర‌వితేజ ఒక కోటి రూపాయ‌లు పారితోషికం త‌గ్గించుకుని రూ.17 కోట్ల‌కు ఒప్పుకొని సినిమాకు సంత‌కం చేశార‌ట‌.

ఈ సినిమాలో ర‌వితేజ రెమ్యునరేష‌న్ గురించిన ఈ వార్త సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. ఆయ‌నొక్క‌రే కాదు ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగ‌మ్మ‌, టాప్ మోడ‌ల్ ఊర్వ‌శీ రౌటేలా కూడా ఒక ప్ర‌త్యేక గీతంలో మెగాస్గార్‌తో క‌లిసి ఆడిపాడ‌నుంది. ఈ పాటలో ఆడిపాడినందుకు ఈ అమ్మ‌డికి కూడా నిర్మాత‌లు భారీగానే తాంబూళం ఇచ్చార‌ని స‌మాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.