Begin typing your search above and press return to search.

భర్తతో కలిసి స్టార్ హీరోయిన్ కీలక ప్రకటన!

By:  Tupaki Desk   |   2 July 2020 4:30 PM GMT
భర్తతో కలిసి స్టార్ హీరోయిన్ కీలక ప్రకటన!
X
సామాన్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని కెరీర్ ముగిస్తారు. ఆ తరువాత క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించేందుకు సిద్దమై సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభింస్తారు. ఇక అదే సెకండ్ ఇన్నింగ్స్ తో తమ కెరీర్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతారు. ఈ నేపథ్యంలో తెలుగులో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందిన బ్యూటీ జెనీలియా. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ క్రియేట్ చేసుకుంది. యూత్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను ఫిదా చేసి వీరాభిమానులను సంపాదించుకుంది. తన అమాయకమైన చూపులతో.. నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే బాలీవుడ్ హీరో రితేష్ దేష్‌ముఖ్‌తో పెళ్లి తరువాత పూర్తిగా సినిమాలకు దూరమైన జెనీలియా.. ఇప్పుడు మళ్లీ తెలుగులో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నిన్న జరిగిన అంతర్జాతీయ డాక్ట‌ర్స్ డే సంద‌ర్భంగా జెనీలియా, రితేష్ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. తమ అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో జెనీలియా ఒక వీడియోను పోస్ట్ చేసింది. ‘‘దీని గురించి రితేష్, నేను చాలా కాలంగా ఆలోచిస్తున్నాం. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు అమలు చేయలేకపోయాం. ఈరోజు డాక్టర్స్ డేను పురష్కరించుకుని మా అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ విషయంలో మాలో స్ఫూర్తినింపిన డాక్టర్ నోజర్ షెరీర్, FOGSIకి ధన్యవాదాలు. మరొకరికి జీవితాన్ని బహుమతిగా ఇవ్వడం కన్నా గొప్ప బహుమతి మరొకటి ఉండదు. ప్రతి ఒక్కరూ అవయవాలను దానం చేయాలని, జీవితాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని జెనీలియా, రితేష్ ఆ వీడియోలో వెల్లడించారు. మరి ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న ఈ దంపతులకు సోషల్ మీడియాలో నెటిజన్లు భారీఎత్తున అభినందనలు తెలుపుతున్నారు.