Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు`తో `లక్ష్మీస్ ఎన్టీఆర్` కు పోటీ!

By:  Tupaki Desk   |   13 Oct 2018 4:51 AM GMT
ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు`తో `లక్ష్మీస్ ఎన్టీఆర్` కు పోటీ!
X
ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్, వైఎస్ ల బ‌యోపిక్ లు ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో `ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు`, `ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు` విడుద‌ల కాబోతోన్న విష‌యం విదిత‌మే. తాజాగా 2019, జ‌న‌వ‌రి 24న‌ తాను తెర‌కెక్కించ‌బోతోన్న `లక్ష్మీస్ ఎన్టీఆర్`ను విడుద‌ల చేస్తాన‌ని వ‌ర్మ సంచ‌లన ప్ర‌క‌ట‌న చేశారు. ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీపార్వ‌తి ప్ర‌వేశింనిన త‌ర్వాత ఏం జ‌రిగిందో త‌న బ‌యోపిక్ లో చూపిస్తాన‌ని వ‌ర్మ అన్నారు. దీంతో, వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 24న విడుద‌ల కాబోతోన్న‌`ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు`కు పోటీగా వ‌ర్మ `లక్ష్మీస్ ఎన్టీఆర్`ను తెర‌కెక్కిస్తున్నారని టాక్ వ‌స్తోంది. త‌న చిత్రంలో ఎన్టీఆర్, ల‌క్ష్మీ పార్వ‌తి ల ఎపిసోడ్ ను వ‌ర్మ ఏవిధంగా చిత్రీక‌రించ‌బోతున్నాడ‌న్న విష‌యంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ రేగుతోంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ఈ రెండు పొలిటిక‌ల్ బ‌యోపిక్ లు పోటాపోటీగా విడుద‌ల కాబోతున్నాయ‌యి.

9 నెల‌ల క్రితం ఎన్టీఆర్ బ‌యోపిక్ తీయ‌బోతున్న‌ట్లు వ‌ర్మ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ ప్ర‌క‌ట‌న‌తో పాటు జై ఎన్టీఆర్‌....జై ఎన్టీఆర్ అంటూ....ఏకంగా ఓ పాట‌ను కూడా విడుద‌ల చేశాడు. ఆ చిత్రాన్ని బాలకృష్ణ నిర్మించి న‌టిస్తున్న‌ట్లు ఊహాగానాలు వ‌చ్చాయి. ల‌క్ష్మీ పార్వ‌తి ఎపిసోడ్ విష‌యంలో బాల‌య్య‌, వ‌ర్మ‌ల మ‌ధ్య విభేదాలు రావ‌డంతో వ‌ర్మ‌ను ఆ ప్రాజెక్టు నుంచి బాల‌య్య త‌ప్పించారని పుకార్లు వ‌చ్చాయి. అందువ‌ల్లే, వ‌ర్మ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` పేరుతో సినిమా తీయ‌బోతున్న‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు. అయితే, వ‌ర్మ ప్ర‌క‌ట‌న‌పై ప‌లువురు ఎన్టీఆర్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం, వ‌ర్మ వేరే సినిమాల‌తో బిజీగా ఉండ‌డంతో ఆ సినిమా అట‌కెక్కింది. తాజాగా వ‌ర్మ ప్ర‌క‌ట‌న‌తో ఆ వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ముంబైకు చెందిన జీవీ ఫిల్మ్స్ ఎండీ బాల‌గిరి తిరుప‌తిలో `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` ముహూర్త కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తార‌ని వ‌ర్మ పోస్ట్ చేశారు. రాకేష్ రెడ్డితో పాటు, జీవీ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయ‌ని వ‌ర్మ చెప్పారు.