Begin typing your search above and press return to search.

విడిపోవట్లేదు బాబూ అంటున్న రేష్మి

By:  Tupaki Desk   |   22 Sep 2016 6:03 AM GMT
విడిపోవట్లేదు బాబూ అంటున్న రేష్మి
X
జిగర్తాండ మూవీ కోసం నేషనల్ అవార్డ్ అందుకున్న బాబీ సింహ.. కోలీవుడ్ హీరోయిన్ రేష్మి మీనన్ లు.. ఈ ఏడాది ఏప్రిల్ 22న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకుని పట్టుమని ఆరునెలలు కూడా పూర్తి కాకముందే వీళ్ల మధ్య తేడాలు వచ్చేశాయని.. త్వరలో విడాకులు కూడా తీసేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. వీటిపై ఎవరూ స్పందించకపోవడంతో.. ఈ హంగామా బాగా ఎక్కువైపోయింది. దీంతో ఆ జంటకు సోషల్ మీడియా సాక్షిగా వీటిని రూమర్లేనంటూ ఖండించాల్సి వచ్చింది.

'రూమర్లకు రియాక్ట్ అవడం కాదు కానీ.. మా గురించి ఆలోచించి మాకు కాల్ చేస్తున్న వారికి సమాధానం చెప్పడం కోసమే ఇదంతా. మేం పెళ్లి చేసుకుని సంతోషంగా బతుకున్నాం. మేం విడదీస్తున్నది ఒక్క పీజా మాత్రమే' అంటూ విడాకుల న్యూస్ అంతా బ్లఫ్ అంటూ ట్విట్టర్ లో ఫన్నీ పంచ్ వేసింది రేష్మి. దీన్ని రీట్వీట్ చేయడమే కాదు.. తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేసిన బాబీ సింహ. తన వెర్షన్ ని మరింత జోడించాడు.

'జనాలు నిజంగా న్యూస్ ఏదో దాన్ని పట్టించుకోవాలి కానీ.. అర్ధం పర్ధం లేకుండా ఆధారం లేని రూమర్లకు కాదు' అంటూ తేల్చేశాడు బాబీ సింహ. తామిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోను కూడా బాబీ సింహ పోస్ట్ చేయడంతో.. విడాకుల వార్తలన్నీ రూమర్లే అని మరోసారి చెప్పినట్లయింది.