Begin typing your search above and press return to search.

అజ్ఞాత‌వాసం కాదు... గురూజీ ఫుల్లు బిజీ

By:  Tupaki Desk   |   26 March 2018 7:03 AM GMT
అజ్ఞాత‌వాసం  కాదు... గురూజీ ఫుల్లు బిజీ
X
త‌న‌దైన పంచ్ డైలాగుల‌తో మాట‌ల మాంత్రికుడిగా చెదిరిపోని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌. అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో ఆయ‌న తీసిన ‘అజ్ఞాత‌వాసి’ సినిమా భారీ అంచ‌నాల‌తో వ‌చ్చి, ఊహించ‌ని విధంగా డిజాస్ట‌ర్‌గా మిగిలింది. దాంతో త్రివిక్ర‌మ్‌పై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆ విమ‌ర్శ‌ల‌ను త‌ట్టుకోలేక త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడ‌ని అన్నారు. నిన్న జ‌రిగిన ‘ఛ‌ల్ మోహ‌న‌రంగ‌’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి ఆయ‌న రాక‌పోవ‌డంతో ఈ విమ‌ర్శ‌లు ఇంకా ఎక్కువ‌య్యాయి.

‘ఛ‌ల్ మోహ‌న‌రంగ‌’ సినిమాకి మూల క‌థ అందించింది త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాసే. అంతేకాకుండా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో క‌లిసి ఈ సినిమాకి స‌హ‌నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించాడు. ఓ ర‌కంగా ఇది కూడా ఆయ‌న సినిమానే. అలాంటి సినిమా ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌కి గురూజీ రాక‌పోవ‌డంతో అంద‌రూ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, అజ్ఞాత‌వాసి కొట్టిన దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేద‌ని కామెంట్ చేశారు. అయితే నిజం అది కాద‌ట‌. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ త‌న త‌ర్వాతి సినిమా యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్‌తో చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్‌టీఆర్ బ‌రువు త‌గ్గే ప‌నిలో ఉన్నాడు. ఇప్ప‌టికే 12 కిలోలో త‌గ్గిన తార‌క్‌, మ‌రో 5 కిలోలు త‌గ్గడానికి క‌స‌రత్తులు చేస్తున్నాడు.

వ‌చ్చే నెల మొద‌టి వారం నుంచి ఈ సినిమా షూటింగ్‌కి వెళ్ళ‌నుంది. అంతేకాకుండా సింగిల్ షెడ్యూల్‌లో సినిమా మొత్తం పూర్తి చేయాల‌ని అనుకుంటున్నారు. అంటే సెట్స్ పైకి వెళ్లాక మ‌ళ్లీ బ్రేక్ తీసుకోవ‌డం జ‌ర‌గ‌దు. అందుకే ఈలోపు త్రివిక్ర‌మ్‌, ప్రీ పొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ చ‌క్క‌బెట్టి ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ట‌. అదీ కాక కొన్ని ప‌ర్స‌న‌ల్ ప‌నులు కూడా ఉండ‌డంతో నితిన్ సినిమా ఫంక్ష‌న్‌కి రాలేదుట త్రివిక్ర‌మ్‌. ‘ఛ‌ల్ మోహ‌న‌రంగ ’సినిమా త‌ప్ప‌క హిట్ అవుతుంద‌నీ, అప్పుడు ఏర్పాటు చేసే స‌క్సెస్ మీట్‌ లో కచ్చితంగా పాల్గొంటా! అని నితిన్‌కి మాటిచ్చాడ‌ని స‌మాచారం.