Begin typing your search above and press return to search.

'ఆచార్య' టీమ్ లో జాయిన్ అయిన రియల్ హీరో..!

By:  Tupaki Desk   |   18 Nov 2020 5:45 AM GMT
ఆచార్య టీమ్ లో జాయిన్ అయిన రియల్ హీరో..!
X
మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''ఆచార్య''. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ మూవీస్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభించారు. చిరంజీవి కరోనా నిర్ధారణ పరీక్షలో ముందు పాజిటివ్ అని రావడం.. ఆ తర్వాత నెగటివ్ అని తేలడంతో ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. అయితే కొరటాల చిత్రీకరణ ఆపేయకుండా చిరు లేని సన్నివేశాలను తీస్తున్నారు. ఈ క్రమంలో కరోనా లాక్ డౌన్ లో రియల్ హీరో అనిపించుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ 'ఆచార్య' సెట్స్ లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.

కరోనా సమయంలో అనేక సామాజిక కార్యకలాపాల్లో పాలుపంచుకున్న సోనూసూద్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ అందరూ సోనూసూద్ డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్' షూటింగ్ లో పాల్గొన్నాడు సోను. అతనికి లాక్ డౌన్లో వచ్చిన ఇమేజ్ దృష్ట్యా స్క్రిప్ట్ లో పలు చేంజెస్ కూడా చేసారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు సోనూసూద్ 'ఆచార్య' షూటింగ్ లో జాయిన్ అయ్యాడని తెలుస్తోంది. మరి ఇందులో సోనూ నెగెటివ్ రోల్ లో కనిపిస్తాడా లేదా పాజిటివ్ పాత్రలో నటిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. కాగా, 'ఆచార్య' లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించనున్నాడు. చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. సందేశాత్మక అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని 2021 వేసవిలో విడుదల చేసేలా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.