Begin typing your search above and press return to search.

మంచి చెడుల‌ను బ్యాలెన్స్ చేస్తున్న చెర్రీ

By:  Tupaki Desk   |   17 May 2021 5:30 AM GMT
మంచి చెడుల‌ను బ్యాలెన్స్ చేస్తున్న చెర్రీ
X
`రంగస్థలం` లాంటి సంచ‌ల‌నం త‌ర్వాత `వినయ విధేయ‌ రామ` లాంటి డిజాస్ట‌ర్ మ‌ర‌క చ‌ర‌ణ్ కి అంటుకుంది. వీవీఆర్ దురదృష్టవశాత్తు రామ్ చ‌ర‌ణ్ లో క‌ల‌వ‌రానికి కార‌ణ‌మైంది. ఆ క్ర‌మంలోనే చ‌ర‌ణ్ త‌న ప్లానింగ్ మొత్తం మార్చేశారు.

ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల‌తో అత‌డు బిజీగా ఉన్నాడు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తో ఆర్.ఆర్.ఆర్ పూర్తి కాగానే త‌దుప‌రి రోబో శంక‌ర్ తో సినిమా చేయాల్సి ఉంది. మెగాస్టార్-కొర‌టాల కాంబినేష‌న్ మూవీ ఆచార్యలో చరణ్ స‌ర్ ప్రైజింగ్ రోల్ ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఆర్.ఆర్.ఆర్- ఆచార్య బ్యాక్ టు బ్యాక్ త‌క్కువ గ్యాప్ లోనే రిలీజ‌య్యేందుకు ఆస్కారం ఉంది.

అటుపై శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ న‌టించే 15వ సినిమా వ‌స్తుంది. ఆ సినిమాని దిల్ రాజు బృందం దాదాపు 400కోట్ల బ‌డ్జెట్ తో అసాధార‌ణంగా నిర్మించ‌నున్నారు. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఈ సినిమా చాలా స్పెష‌ల్ గా ఉండ‌నుంద‌న్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే భార‌తీయుడు 2 (ఇండియ‌న్ 2) వివాదాల్ని ప‌రిష్క‌రించుకుని ఆ సినిమాని పూర్తి చేశాకే సెట్స్ కెళ‌తారా? అన్న‌దానిపై ఈవారంలో క్లారిటీ రానుంద‌ట‌.

లైకాతో స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించుకోవాల్సిందిగా దిల్ రాజు -శంక‌ర్ బృందం పై ఇప్ప‌టికే చ‌ర‌ణ్ ఒత్తిడి పెంచే ప‌నిలో ఉన్నారు. మ‌రోవైపు క‌మ‌ల్ హాస‌న్ కూడా భార‌తీయుడు 2 పూర్తి చేయించేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఇక చ‌ర‌ణ్ మంచి చెడును బ్యాలెన్స్ చేస్తూ ప‌రిణ‌తితో ముందుకు సాగిపోతున్నాడు. రంగ‌స్థ‌లం ద‌ర్శ‌కుడు సుకుమార్ తో త‌దుప‌రి చిత్రం చేసేందుకు కూడా స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు. వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో బిజీగా ఉన్న‌ వెంకీ కుడుముల చెర్రీకి ఓ క‌థ‌ను వినిపించార‌ని కూడా తెలుస్తోంది.