Begin typing your search above and press return to search.

ఇప్పుడు కిక్కిచ్చి, చవితికి పంజా...

By:  Tupaki Desk   |   12 April 2015 6:41 AM GMT
ఇప్పుడు కిక్కిచ్చి, చవితికి పంజా...
X
మాస్‌ మహరాజ్‌ రవితేజ ఏకకాలంలో రెండు సినిమాలు పూర్తి చేస్తున్నాడు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో 'కిక్‌ 2' షూటింగ్‌ ఇటీవలే పూర్తయింది. విదేశాల్లో పాటల చిత్రీకరణ్‌ పూర్తి చేసుకుని, ప్రస్తుతం సంపత్‌నంది దర్శకత్వంలోని 'బెంగాల్‌ టైగర్‌' చిత్రీకరణలో పాల్గొంటున్నాడు.

ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ ఔట్‌స్కర్ట్స్‌లో సాగుతోంది. చిలుకూరు బాలాజీ దేవాలయానికి సమీపంలో ఉన్న ఓ ఫామ్‌ హౌస్‌లో బెంగాల్‌ టైగర్‌ చిత్రీకరణ సాగుతోంది. మాస్‌ రాజా స్టయిల్‌కి తగ్గట్టే ఈ సినిమా ఉంటుంది. రాజాలోని ఎనర్జీని పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకొస్తున్నాడు సంపత్‌నంది. అందాల నాయికలు తమన్నా, రాశిఖన్నా మాస్‌రాజాతో పాటు షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

అలాగే అత్తారింటికి దారేది చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయిన బొమన్‌ ఇరానీ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్‌లో వినాయక చవితికి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. ఈలోగానే కిక్‌ 2 రిలీజవుతుంది. ఈ సినిమాతో కిక్కిచ్చే హిట్‌ కొట్టి మాస్‌ రాజా పంజా విసరడానికి వస్తాడన్నమాట!