Begin typing your search above and press return to search.

దగ్గుబాటి క్షణం.. అబ్బే లేదంట

By:  Tupaki Desk   |   13 July 2016 3:31 PM GMT
దగ్గుబాటి క్షణం.. అబ్బే లేదంట
X
కొన్ని రోజులుగా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న ఓ హాట్ న్యూస్ ఏంటంటే.. దగ్గుబాటి హీరోలు మల్టీ స్టారర్ చేస్తున్నారనే. లో బడ్జెట్ లో క్షణం అంటూ సూపర్బ్ థ్రిల్లర్ ను తీసి సక్సెస్ చేసిన రవికాంత్ పెరెపు దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుందని.. బాబాయ్ అబ్బాయ్ లయిన దగ్గుబాటి వెంకటేష్ - రానాలు ఈ సినిమాలో నటిస్తున్నారని రూమర్స్ వచ్చాయి.

ఈ వార్తలపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందని చెప్పాలి. రవికాంత్ పెరెపుతో నేరుగా ఓ విషయాన్ని చెప్పేశాడు. మీడియాలో వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చాడు. అసలు దగ్గుబాటి హీరోలతో మల్టీ స్టారర్ అనే కాన్సెప్ట్ తన దగ్గర లేదన్నాడు రవికాంత్. మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా రూమర్లు మాత్రమే అన్న క్షణం దర్శకుడు.. ఏ ప్రాజెక్ట్ గురించి అయినా తాను అనౌన్స్ మెంట్ ఇస్తానని చెప్పాడు.

ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కు స్టోరీ రెడీ చేసుకుంటున్నానని.. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యాక మిగిలిన వివరాలు చెబుతానన్నాడు రవికాంత్ పెరెపు. ఎవరితో సినిమా చేయబోతున్నాననే మాట చెప్పేందుకు మరింత సమయం కూడా ఉందని అన్నాడు. ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఇచ్చిన క్లారిటీతో.. దగ్గుబాటి మల్టీ స్టారర్ పై ఆశలన్నీ అడియాశలు అయిపోయినట్లే.