Begin typing your search above and press return to search.

క్షణం దర్శకుడితో బాహుబలి విలన్

By:  Tupaki Desk   |   22 April 2016 4:06 AM GMT
క్షణం దర్శకుడితో బాహుబలి విలన్
X
క్షణం మూవీతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు దర్శకుడు రవికాంత్ పెరెపు. అడివి శేష్ తో కలిసి చేసిన క్షణం ఒక్క సినిమాతోనే.. పది సినిమాలకు సరిపడేంతటి గుర్తింపు పొందాడు. ఇప్పుడీ డైరెక్టర్.. తన నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టాడు. అయితే అడివి శేష్ తో కాకుండా.. ఈ సారి పెద్ద హీరోలకు గురి పెట్టాడు రవికాంత్.

'క్షణం తర్వాత ప్రస్తుతం నేను ఓ లవ్ స్టోరీ చేయబోతున్నాను. ఈ సబ్జెక్ట్ ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది. ప్రస్తుతం కొన్ని నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నాను. కానీ వాటి పేర్లు ఇప్పుడే చెప్పను. అయితే, హీరోగా నటించే విషయంలో మాత్రం దగ్గుబాటి రాణాతో మాట్లాడుతున్నాను' అని చెప్పాడు రవికాంత్ పెరెపు.

తొలి చిత్రంతో పోల్చితే.. ఈ లవ్ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటుందన్న రవికాంత్.. ఇంకా స్క్రిప్ట్ దశలో ఉన్న మూవీపై ఇంతకంటే మాట్లాడలేనని చెప్పాడు. రాణా మాత్రం ఈ సబ్జెక్ట్ పై ఇంట్రెస్ట్ చూపించాడని రవికాంత్ అంటున్నాడు.