Begin typing your search above and press return to search.

10 కోట్ల పారితోషికం విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టిన మాస్ రాజా!

By:  Tupaki Desk   |   2 Jan 2022 3:30 AM GMT
10 కోట్ల పారితోషికం విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టిన మాస్ రాజా!
X
మాస్ మ‌హారాజా రవితేజ‌పై ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లున్నాయి. అత‌డు వ‌రుస ఫ్లాపుల్లో ఉన్నా కానీ 10కోట్ల పారితోషికం ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టుప‌డుతున్నాడ‌ని.. ఎక్క‌డా త‌గ్గ‌క‌పోవ‌డంతో నిర్మాత‌లు సీరియ‌స్ గా ఉన్నార‌ని కూడా టాక్ వినిపించింది. క్రాక్ బంప‌ర్ హిట్ కాక ముందు రాజా స‌న్నివేశం పూర్తి స్లంపులో ప‌డింది. అలాంటి స‌మ‌యంలో అత‌డిపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఒక సెక్ష‌న్ మీడియా రాజాని ఒక రేంజులో ఆడేసుకుంది. కానీ ఇప్పుడు ఎన్.బి.కే అన్ స్టాప‌బుల్ షోలో అన్నిటికీ రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు మాస్ రాజా.

ఆహా-తెలుగు షోలో త‌న‌కు ఎదురైన ఇదే ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ.. మాస్ మ‌హారాజా అన్న మాట వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. ఈ వీడియో క్లిప్ లో ర‌వితేజ మాట్లాడుతూ-``లాస్ట్ మూవ్ మెంట్ లో సినిమా ఫ్లాపైంది అనుకోండి .. నేను తిరిగిచ్చేసేవాడిని.. చెక్ చింపేసి ఇచ్చేసేవాడిని..`` అని ర‌వితేజ అన్నారు.

దానికి స్పంద‌న‌గా ఎన్.బి.కే ఏమ‌న్నారంటే.. ప్రొడ్యూస‌ర్ గురించి ఆలోచించిన వాడే హీరో అవుతాడు.. మాస్ హీరో అవుతాడు!! అంటూ బాల‌య్య బాబు ఎంక‌రేజ్ చేసారు. ర‌వితేజ‌- గోపిచంద్ మ‌లినేని బృందంతో బాల‌య్య స్పెష‌ల్ షోలో గ్లింప్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. బాల‌య్య‌తో త‌దుప‌రి క్రాక్ ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. వీటిలో తొలిగా ఖిలాడీ విడుద‌ల కానుంది.

అన్న‌ట్టు ముందు 10కోట్లు తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నా కానీ చివ‌రి నిమిషంలో ఫ్లాప్ అయ్యింది అన‌గానే తిరిగి వెన‌క్కి ఇచ్చే అల‌వాటు ఉంది కాబ‌ట్టే ఇన్నేళ్లుగా మాస్ రాజా హీరోగా కొన‌సాగార‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. నిర్మాత‌ల హీరోగా లేక‌పోతే ఇక్క‌డ ఎవ‌రికీ మ‌నుగ‌డ ఉండ‌ద‌ని అగ్ర హీరోలే చాలాసార్లు వేదిక‌ల‌పై చెబుతుంటారు. ర‌జ‌నీకాంత్ - చిరంజీవి- అమితాబ్ స‌హా ఎంద‌రో హీరోలు నిర్మాత‌ల హీరోలుగానే ఉన్న సంగ‌తి తెలిసిందే. వీళ్లంద‌రినీ ర‌వితేజ అనుస‌రిస్తున్నారు.