Begin typing your search above and press return to search.

మాస్‌ రాజా మరోటి కన్ఫర్మ్‌ చేశాడు

By:  Tupaki Desk   |   27 Feb 2020 7:00 AM GMT
మాస్‌ రాజా మరోటి కన్ఫర్మ్‌ చేశాడు
X
డిస్కోరాజా చిత్రంతో తీవ్రంగా నిరాశ పర్చినా కూడా రవితేజ తదుపరి చిత్రాల విషయంలో మాత్రం ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఆయనతో సినిమాలు తీసేందుకు కూడా నిర్మాతలు ఆసక్తి చూపించడం ఆశ్చర్యంగా ఉంది. రవితేజ సక్సెస్‌ దక్కించుకుని చాలా కాలం అయ్యింది. మద్యలో రాజా ది గ్రేట్‌ సినిమా కాకుండా అంతకు ముందు కూడా చాలా ఫ్లాప్‌ లను మన మాస్‌ రాజా ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఈయన తదుపరి చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి లేదు.

ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్‌’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. సమ్మర్‌ లో ఆ సినిమా విడుదల కాబోతుంది. మరో వైపు రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్‌ అయినట్లుగా వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో క్రాక్‌ సినిమా విడుదలైన వెంటనే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు రవితేజ రెడీ అయ్యాడు. దర్శకుడు త్రినాధరావు నక్కిన 2018లో హలో గురు ప్రేమకోసమే సినిమా చేశాడు. ఆ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఆ సినిమా తర్వాత ఈ దర్శకుడు పలువురు హీరోలను కలిసినా ఎవరితోనూ వర్కౌట్‌ అవ్వలేదు.

చివరకు రవితేజతో త్రినాధరావుకు జోడీ కుదిరింది. వీరిద్దరిని కలిపింది పీపుల్స్‌ మీడియా నిర్మాణ సంస్థ. ప్రస్తుతం వరుసగా చిత్రాలను నిర్మిస్తున్న పీపుల్స్‌ మీడియా వారు రవితేజ.. త్రినాధరావు నక్కినల కాంబో మూవీని నిర్మించేందుకు రెడీ అయ్యారు. ఇదే ఏడాదిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారట. రమేష్‌ వర్మ మూవీ కంటే ముందే ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్‌ వినిపిస్తుంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.