Begin typing your search above and press return to search.

వైట్ల కోసం రాజా మూడు పాత్రల్లోనా??

By:  Tupaki Desk   |   9 Oct 2017 5:13 PM GMT
వైట్ల కోసం రాజా మూడు పాత్రల్లోనా??
X
ఒకప్పుడు తన దర్శకత్వ ప్రతిభతో నవ్వించే శ్రీను వైట్ల - నటనతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మాస్ మహారాజ రవి తేజ ఇద్దరు దాదాపు ఇప్పుడు ఒకే ఫెయిల్యూర్ స్టేజ్ లో ఉన్నారు. మొదట్లో వీరిద్దరి కలయికలో వచ్చిన నీ కోసం - దుబాయ్ సీను సినిమాలు ప్రేక్షకుల ను చాలా అలరించాయి. కానీ ప్రేక్షకులు చాలా మారిపోయారు. అంతే కాకుండా చాలా వరకు సినిమాల నాలెడ్జ్ పెరిగిపోయింది. దీంతో ఇంతకుముందు దర్శకులు ఒక సినిమా తీసి అదే తరహాలో కాస్త టచ్ చేసి మరో సినిమా చేసినా ఒప్పుకోవడం లేదు. హీరోలు కూడా కొత్త తరహా క్యారెక్టర్స్ ను ఎంచుకుంటేనే ప్రేక్షకులకు నచ్చుతొంది.

ఇప్పుడు శ్రీను వైట్ల - రవి తేజ ఒక కొత్త తరహతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నారని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రవి తేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించే సినిమాకు ''అమర్ అక్బర్ అంథోని'' అనే టైటిల్ ఖరారైనట్లు టాక్. ఎందుకంటే రవి తేజ మూడు విభిన్న పాత్రలను ఈ సినిమాలో చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జనవరి ఎండింగ్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లేలా చిత్ర యూనిట్ ప్లానింగ్ చేసుకుందట. ప్రస్తుతం రవి తేజ రాజా ది గ్రేట్ - టచ్ చేసి చూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజా ది గ్రేట్ రిలీజ్ కి రెడీగా ఉంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ కూడా నాగచైతన్య తో సవ్యాసాచి సినిమాని నిర్మిస్తోంది. హీరో నిర్మాతలు జనవరి వరకు బిజీ కాబట్టి అప్పటివరకు శ్రీను వైట్ల క్యారెక్టర్స్ ని ఎంపిక చేసుకునే పనిలో ఉంటాడట.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి డైరెక్టర్ - హీరో రెమ్యునరేషన్ తీసుకోలేదని ఒక టాక్ ఉంది. సినిమా హిట్ అయితే షేర్స్ ఇవ్వనున్నట్లు ఫిల్మ్ నగర్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి.