Begin typing your search above and press return to search.

2 నెలల మాస్ రాజా యుఎస్ ట్రిప్

By:  Tupaki Desk   |   20 May 2018 9:55 AM GMT
2 నెలల మాస్ రాజా యుఎస్ ట్రిప్
X
మాస్ మహారాజా రవితేజ నేల టికెట్టు రానున్న శుక్రవారం విడుదల అవుతోంది. పెద్దగా పోటీ లేకుండా వస్తున్న ఈ మూవీకి టాక్ కనక బాగా వస్తే మహానటి తప్ప వేరే ఆప్షన్ లేక కొత్త వాటి కోసం ఎదురుచూస్తున్న సినిమా ప్రేమికుల దాహం తీర్చినట్టు అవుతుంది. దీని తర్వాత చేయడానికి ఒప్పుకున్న అమర్ అక్బర్ ఆంటోనీ కోసం రవితేజ రెండు నెలల పాటు అమెరికాలోనే మకాం వేయబోతున్నాడు. శీను వైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవి ట్రిపుల్ రోల్ చేస్తున్నాడా లేక ఒకే పాత్రలో మూడు వెరీయేషన్స్ ఉంటాయా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. టచ్ చేసి చూడు ఫలితం షాక్ ఇచ్చినా వరస సినిమాలతో దూకుడు మీదున్న రవితేజ తన పాత స్టైల్ లో ఏడాదికి మూడు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అమర్ అక్బర్ ఆంటోనీ కూడా ఈ ఏడాదే వచ్చేస్తుంది.

సునీల్ ఇందులో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో పాటు పడిపడి లేచే మనసు-అరవింద సమేత వీర రాఘవలో కూడా హాస్య పాత్రలు ఒప్పుకున్న సునీల్ కు వీటిలో ఏది ముందు విడుదలైతే అదే కం బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అమర్ అక్బర్ ఆంటోనీ షూటింగ్ ప్రారంభోత్సవంలో అను ఇమ్మనియేల్ ని హీరోయిన్ గా చూపించారు కానీ కాల్ షీట్స్ ప్రాబ్లమ్ వల్ల తను డ్రాప్ అయినట్టు మైత్రి సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే పేరుతో తెలుగులో లేదు కానీ 80 దశకంలో బాలీవుడ్ లో ఒక సూపర్ హిట్ మల్టీ స్టారర్ వచ్చింది. అమితాబ్-వినోద్ ఖన్నా-రిషి కపూర్ నటించిన ఆ మూవీ టైటిల్ తెలుగులో రావడం ఇదే మొదటిసారి. బ్యాడ్ ఫామ్ లో ఉన్న శీను వైట్ల దీంతో తన సత్తా చాటుతాను అంటున్నాడు. ఇండస్ట్రీ హిట్ కన్నా తక్కువ స్థాయి సినిమా ఇప్పటిదాకా నిర్మించని రికార్డ్ మైంటైన్ చేస్తున్న మైత్రి సంస్థ దీనికి నిర్మాత కావడం మొదటి శుభసూచకంగా భావిస్తున్నారు ఫాన్స్. అమెరికాలో కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసి బాలన్స్ షూటింగ్ ఇక్కడ చేయనున్నారు. దసరా లేదా దీపావళి టార్గెట్ చేసిన ఈ మూవీలో తారాగణం భారీగా ఉంది.