Begin typing your search above and press return to search.

ర‌ష్మిక మ‌రో జాక్ పాట్.. ఈసారి ఏకంగా భాయ్ తో!

By:  Tupaki Desk   |   22 Jun 2022 10:30 AM GMT
ర‌ష్మిక మ‌రో జాక్ పాట్.. ఈసారి ఏకంగా భాయ్ తో!
X
అదృష్టం అంటే ర‌ష్మిక‌దే. ఛ‌లో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఐదేళ్ల క్రితం వ‌న్ ఫిలిం కిడ్. కానీ ఇప్పుడు సూప‌ర్ స్టార్. స్టారాధిస్టార్ల‌కు ఉన్న బెట‌ర్ ఆప్ష‌న్. అంత‌గా ఐదేళ్ల‌లోనే ఈ భామ ఎదిగేసింది. ఇండ‌స్ట్రీ నుంచి రూ.3కోట్లు డిమాండ్ చేస్తున్న క్రేజీ నాయిక‌గానూ ర‌ష్మిక పేరు మార్మోగుతోంది. ఏడాదికి 10కోట్ల వార్షికాదాయం సునాయాసంగా సంపాదిస్తూ ఇత‌ర నాయిక‌ల‌కు స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఇటు సౌత్ అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌నా న‌టించేస్తున్న ర‌ష్మిక పుష్ప చిత్రంతో పాన్ ఇండియా నాయిక‌గా ఎదిగింది. త‌దుప‌రి పుష్ప 2తో మ‌రో లెవ‌ల్ కి చేరిపోతుంద‌న‌డంలో సందేహం లేదు. మ‌రోవైపు బాలీవుడ్ కెరీర్ కూడా ఆషామాషీగా లేదు. ఆరంభ‌మే బిగ్ బి అమితాబ్ లాంటి స్టార్ తో క‌లిసి క్రేజీ చిత్రంలో న‌టించేస్తోంది. అలాగే సిద్ధార్థ్ మ‌ల్హోత్రా లాంటి ఎన‌ర్జిటిక్ స్టార్ స‌ర‌స‌న దేశ‌భ‌క్తి చిత్రంలో యాక్ష‌న్ రోల్ ని పోషిస్తోందంటే అర్థం చేసుకోవాలి. ఇంత‌లోనే ర‌ణ‌బీర్ క‌పూర్ లాంటి క్రేజీ స్టార్ స‌ర‌స‌న యానిమ‌ల్ చిత్రంలో అవ‌కాశం ఛేజిక్కించుకుంది. ప్ర‌స్తుతం ముంబైలోనే కాపురం పెట్టిన ర‌ష్మిక‌కు అవ‌కాశాలు ఒక రేంజులో ఉన్నాయి.

ఇంత‌లోనే మ‌రో జాక్ పాట్ ప‌ట్టింద‌న్న వార్త ఇప్పుడు టాలీవుడ్ ని హీటెక్కిస్తోంది. ఈ భామ త‌న కెరీర్ లో తొలిసారిగా ఖాన్ స‌ర‌స‌న‌ ఆఫ‌ర్ ద‌క్కించుకుంది. అది కూడా స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న క్రేజీ సినిమాలో న‌టించ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

సల్మాన్ ఖాన్ మూవీ 'నో ఎంట్రీ 2' లో 10 మంది హీరోయిన్లు ఉంటారని ఇంత‌కుముందే క‌థ‌నాలొచ్చాయి. దక్షిణ భారత దేశంలోని క్రేజీ హీరోయిన్స్ పైనా స‌ల్మాన్ భాయ్ క‌న్నేసార‌ని గుస‌గుస వినిపిస్తోంది. టైగర్ 3 తర్వాత నో ఎంట్రీ 2 సెట్స్ కి వెళుతుంది. హిట్ మూవీ సీక్వెల్ లో అనిల్ కపూర్ - ఫర్దీన్ ఖాన్ లు కూడా న‌టిస్తారు. ఆస‌క్తిక‌రంగా నో ఎంట్రీ 2లో స‌ల్మాన్ స‌హా హీరోలంతా త్రిపాత్ర‌ల్లో క‌నిపించ‌డం పెద్ద ట్విస్ట్.

దీంతో ఏకంగా ప‌ది మంది నాయిక‌లు అవ‌స‌ర‌మ‌ని ఇంత‌కుముందే క‌థ‌నాలొచ్చాయి. ఇక ఇటీవ‌ల దక్షిణ భారత అగ్ర నటీమణుల పేర్ల‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రష్మిక మందన్న స‌హా సమంతా రూత్ ప్రభు.. పూజా హెగ్డే ..తమన్నా భాటియా లాంటి టాప్ హీరోయిన్ల‌ను 'నో ఎంట్రీ 2'కి ఎంపిక చేయ‌నున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా అప్పీల్ ని తేవ‌డం కోసం భాయ్ తెలివిగా ఇలా ప్లాన్ చేస్తున్నార‌ని కూడా టాక్ వినిపిస్తోంది.

పుష్ప ఘ‌న‌విజ‌యంతో రష్మిక మందన్న బాలీవుడ్ లో పాపులర్ ఫేస్ గా మారింది. ఈ చిత్రంలో శ్రీవల్లిగా నటించి గుండెల్ని కొల్ల‌గొట్టింది. ఇప్పుడు ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా 'మిషన్ మజ్ను'తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో తన నటనతో అందరినీ ఆకర్షించిన సమంత రూత్ ప్రభు దేశవ్యాప్తంగా పాపుల‌రైంది. పూజా హెగ్డే -తమన్నా బాలీవుడ్ లో బాగా తెలిసిన ముఖాలు.. అందుకే సల్మాన్ ఖాన్ స‌ద‌రు భామ‌ల‌ పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నార‌ని తెలిసింది. అయితే ఇందులో ఫ్రెష్ ట్యాలెంట్ ర‌ష్మిక మంద‌న‌కు ఛాన్స్ ఆల్మోస్ట్ ఖాయ‌మైన‌ట్టేన‌న్న గుస‌గుసా వేడెక్కిస్తోంది.