Begin typing your search above and press return to search.

ర‌ష్మిక థై షో బాలీవుడ్ కోస‌మా?

By:  Tupaki Desk   |   1 Feb 2022 8:31 AM GMT
ర‌ష్మిక థై షో బాలీవుడ్ కోస‌మా?
X
`ఛ‌లో` చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్న‌.. తొలి చిత్రంతో అనూహ్యంగా సూప‌ర్ హిట్ ని సొంతం చేసుకుని టాలీవుడ్ బిగ్గీస్ దృష్టిని ఆక‌ర్షించింది. క్రేజీ హీరోయిన్ గా తొలి చిత్రంతో మంచి గుర్తింపుని సొంతం చేసుకోవ‌డంతో ర‌ష్మిక‌కు టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫ‌ర్ లు ప‌ల‌క‌రించాయి. `గీత గోవిందం`తో వంద కోట్ల క్ల‌బ్ లో చేరి టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనిపించుకుంది. త‌ను చేసిన ప్ర‌తీ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్, బ్లాక్ బ‌స్ట‌ర్ లుగా నిల‌వ‌డంతో ర‌ష్మిక టాప్ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయింది.

గ‌త ఏడాది `పుష్ప‌`తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. అన‌తి కాలంలోనే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో క‌లిసి న‌టించే ఛాన్స్ ని ద‌క్కించుకుని ఆ సినిమాతో సుకుమార్ దృష్టిలో ప‌డింది. శ్రీ‌వ‌ల్లిగా ర‌ష్మిక అభిన‌యం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. `సామీ సామీ.. పాట‌లోని సిగ్నేచ‌ర్ స్టెప్ ని ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో ప్ర‌ద‌ర్శించి వైర‌ల్ గా మారిన ర‌ష్మిక త‌న క్రేజ్ తో నేష‌న‌ల్ క్ర‌ష్ గా మారింది. పాన్ ఇండియా స్థాయిలో న‌టిగా పేరు తెచ్చుకోవాల‌ని గ‌త కొంత కాలంగా క‌ల‌లు క‌న్న ర‌ష్మిక `పుష్ప‌`తో ఆ ఫీట్ ని సొంతం చేసుకున్న న‌టిగా పేరు తెచ్చుకుంది.

ఈ క్రేజ్ తో ఇప్ప‌డు ర‌ష్మిక బాలీవుడ్ లోనూ పాగా వేయాల‌ని భావిస్తోంది. ఇదే ఏడాది ర‌ష్మిక బాలీవుడ్ కు ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ రెండు క్రేజీ చిత్రాల్లో న‌టించే అవ‌కాశాన్ని సొంతం చేసుకుంది. మిష‌న్ మ‌జ్ను, గుడ్ బై చిత్రాల్లో ప్ర‌స్తుతం ర‌ష్మిక న‌టిస్తోంది. `మిష‌న్ మ‌జ్ను`లో సిద్ధార్ధ్ మ‌ల్హోత్రాతో క‌లిసి న‌టిస్తున్న రష్మిక.. `గుడ్ బై` చిత్రంలో ఏకంగా బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ లో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.

ఈ చిత్రంలో ర‌ష్మిక .. అమితాబ్ కూతురిగా క‌నిపించ‌బోతోంది. ఈ రెండు చిత్రాలు చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మే 13న `మిష‌న్ మ‌జ్ను` రిలీజ్ కు రెడీ అవుతుండ‌గా `గుడ్ బై` రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ఖ‌రారు కాలేదు. ఇదిలా వుంటే ఈ రెండే చిత్రాల త‌రువాత బాలీవుడ్ లో పాగావేయాల‌ని ర‌ష్మిక అప్పుడే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మొద‌లు పెట్టింది. బాలీవుడ్ లో రాణించాలంటే ఎక్స్‌పోజింగ్ త‌ప్ప‌నిస‌రి. దీంతో ర‌ష్మిక `పుష్ప‌`కు సంబంధించిన ఏ ఈవెంట్ వున్నా బాలీవుడ్ మీడియాతో పాటు అక్క‌డి వారిని ఎట్రాక్ట్ చేసేందుకు అందుకు త‌గ్గ‌ట్టుగా డ్రెస్ చేసుకుంటూ అందాల ప్ర‌ద‌ర్శిన‌కు రెడీ అయిపోతోంది.

ఇటీవ‌ల‌ `పుష్ప‌` రిలీజ్ కు ముందు.. రిలీజ్ త‌రువాత జ‌రిగిన‌ ప్ర‌తీ ఈవెంట్ లోనూ ర‌ష్మిక గ‌తంతో పోలిస్తే మ‌రింత హాట్ గా క‌నిపించ‌డానికే ఇష్ట‌ప‌డింది. తాజాగా ర‌ష్మిక థై షో చేస్తూ బ్లాక్ డ్రెస్ లో క‌వ్విస్తున్న ఫొటోలు ఇప్ప‌డు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఈ ఫొటోలు చూసిన వారంతా ర‌ష్మిక థై షో బాలీవుడ్ కోస‌మేమా? అంటూ ఆరాలు తీస్తున్నారు. ర‌ష్మిక మాత్రం బాలీవుడ్ లో క్రేజీ ఆఫ‌ర్లని ద‌క్కించుకు కోవాలంటే గ్లామ‌ర్ షో చేయాల్సిందే అంటూ త‌న ప‌ని తాను చేసుకుంటూ నెట్టింట వైర‌ల్ అవుతోంది.