Begin typing your search above and press return to search.

రష్మిక 'గుడ్ బై'.. ఫైనల్ గా ఏమైందంటే?

By:  Tupaki Desk   |   9 Oct 2022 8:30 AM GMT
రష్మిక గుడ్ బై.. ఫైనల్ గా ఏమైందంటే?
X
మొన్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమంలో చాలా బిజీగా కనిపించిన రష్మిక మందన్న ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇక పుష్ప సినిమాతో ఆమెకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ రావడంతో ఇప్పుడు అక్కడ కూడా వరుసగా ఆఫర్లు అయితే వస్తున్నాయి. అయితే రష్మిక మందన్న తొందర పడకుండా మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటుంది.

ఈ క్రమంలోనే ఆమెకు మొదటిసారి అమితాబచ్చన్ తో నటించే అవకాశం దొరికింది. వికాస్ బహ్ల్ దర్శకత్వంలో అమితాబచ్చన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన గుడ్ బై సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఎలా ఉంది బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసింది వివరాల్లోకి వెళితే.. రష్మికకు హిందీలో ఇది మొదటి స్ట్రైట్ మూవీ. ఎలాగైనా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలి అని ప్రమోషన్స్ లో కూడా చాలా బిజీగా కనిపించింది.

అయితే సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరుత్సాహపరిచింది. అమితాబచ్చన్ అలాగే పుష్ప సినిమాతో క్రేజ్ అందుకున్న శ్రీవల్లి ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఆశ్చర్యపరిచే నెంబర్స్ ఏమి నమోదు చేయలేదు. మొదటి రోజు కేవలం కోటి షేర్ మాత్రమే వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ కథనాలు కూడా బాలీవుడ్ ఆడియెన్స్ కు అంతగా కనెక్ట్ కాలేదని తెలుస్తోంది.

ఒక కుటుంబంలో చనిపోయిన తల్లి ఆ తర్వాత ఎదురయ్యే ఎమోషనల్ సన్నివేశాలు అలాగే మరికొన్ని ఎంటర్టైన్మెంట్ కామెడీ సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ప్రధానంగా నిలిచాయి. అయితే దర్శకుడు ఈ సినిమాను ఒకవైపు ఎంటర్టైన్ చేస్తూనే మరొకవైపు ఎమోషనల్ గా కూడా ఆడియన్స్ కు కనెక్ట్ చేయాలని అనుకున్నాడు. స్టోరీ పాయింట్ కొత్తదే కానీ ప్రస్తుతం మాస్ కంటెంట్ సినిమాలకు ఎక్కువగా అలవాటు పడిన హిందీ ప్రేక్షకులు ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు.

ఇక ఆదివారం తప్పితే ఈ సినిమాకు మళ్ళీ వీకెండ్ తర్వాత పెద్దగా కలెక్షన్స్ కూడా రాకపోవచ్చు అని తెలుస్తోంది. రష్మిక నటన మాత్రం ఈ సినిమాలో అద్భుతంగా ఉంది అని బాలీవుడ్ క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. మరి ఆ రూట్లో అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త అవకాశాలు ఏమైనా అందుకుంటుందో లేదో చూడాలి.