Begin typing your search above and press return to search.

రష్మిక టైమ్ మామూలుగా లేదుగా

By:  Tupaki Desk   |   22 April 2022 12:30 AM GMT
రష్మిక టైమ్ మామూలుగా లేదుగా
X
రష్మిక మంద‌న్న కెరీర్ ఒక్క‌సారిగా 'పుష్ప‌'తో మారిపోయింది. 'ఛ‌లో' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ క‌న్న‌డ సుంద‌రి తొలి చిత్రంతో మంచి మార్కులు కొట్టేయ‌డ‌మే కాకుండా తొల సూప‌ర్ హిట్ ని కూడా సొంతం చేసుకుని స్టార్ డైరెక్ట‌ర్ ల దృష్టిని ఆక‌ర్షించింది.

అంచ‌లంచెలుగా ఎదుగుతూ క్రేజీ ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకుంటూ 'స‌రిలేరు నీకెవ్వ‌రు' చిత్రంతో స్టార్ హీరోయిన్ ల జాబితాలో చేరింది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా న‌టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డంతో ప‌రిశ్ర‌మ వ‌ర్గాల దృష్టిలో ప‌డింది.

ఇక గ‌తేడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన 'పుష్ప ది రైజ్‌' మూవీతో పాన్ ఇండియా వైడ్ గా తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ ని ద‌క్కించుకోవ‌డ‌మే కాకుండా పాన్ ఇండియా హీరోయిన్ ల జాబితాలో చేరిపోయింది. దేశ వ్యాప్తంగా 'పుష్ప' ఓ ప‌క్క ప్ర‌భంజ‌నాన్ని సృష్టిస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుంటే ఇదే స్పీడుతో బాలీవుడ్ లో పాగా వేయ‌డం మొద‌లుపెట్టింది. ర‌ష్మిక 'పుష్ప‌' త‌రువాత బాలీవుడ్ లో రెండు చిత్రాల్లో న‌టిస్తోంది. ఇప్ప‌టికే సిద్ధార్ధ్ మ‌ల్హోత్రాతో క‌లిసి న‌టిస్తున్న 'మిష‌న్ మ‌జ్ను' చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది.

శంత‌ను బ‌గ్చి రూపొందిస్తున్న ఈమూవీ జూన్ 10న భారీ స్థాయిలో విడుద‌ల కాబోతోంది. అమితాబ్ తో వికాస్ బెహెల్ డైరెక్ష‌న్ లో ఏక్తా క‌పూర్ నిర్మిస్తున్న 'గుడ్ బై' మూవీలోనూ న‌టిస్తోంది. రీసెంట్ గా దుల్క‌ర్ స‌ల్మాన్ 'సీతారామ‌మ్‌', ద‌ళ‌ప‌తి విజ‌య్ 66వ చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. 'పుష్ప‌' చిత్రానికి సీక్వెల్ గా రానున్న 'పుష్ప 2' షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది. ఇలా బ్లాక్ టు బ్యాక్ క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వున్న ర‌ష్మిక‌కు తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

త్వ‌ర‌లో 'పుష్ప‌2' సెట్స్ పైకి రానున్న నేప‌థ్యంలో ర‌ష్మిక‌కు మ‌రో క్రేజీ స్టార్ చిత్రంలో న‌టించే అవ‌కాశం ల‌భించిన‌ట్టుగా తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. 'ట్రిపుల్ ఆర్' బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌బోతున్న విష‌యం తెలిసిందే. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించనున్న ఈ చిత్రాన్ని యువ సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై పంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో సుధాక‌ర్ మిక్కిలినేని నిర్మించ‌బోతున్నారు.

'ట్రిపుల్ ఆర్' కార‌ణంగా ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చిన ఈ ప్రాజెక్ట్ జూన్‌ నుంచి సెట్స్ పైకి రాబోతోంది. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ న‌టిస్తుంద‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇటీవ‌ల ర‌ణ్ బీర్ ని వివాహం చేసుకున్న అలియా ఈ సినిమాపై పెద్ద‌గా ఆస‌క్తిని చూపించ‌డం లేద‌ని, దీంతో మేక‌ర్స్ ఆ స్థానంలో ర‌ష్మిక‌ని సంప్ర‌దిస్తున్నార‌ని, త్వ‌ర‌లోనే అధికారికంగా ఈ వార్త‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.