Begin typing your search above and press return to search.

రష్మిక మరో పాన్‌ ఇండియా చిత్రం

By:  Tupaki Desk   |   26 July 2020 2:30 PM GMT
రష్మిక మరో పాన్‌ ఇండియా చిత్రం
X
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తెలుగులో ‘గీతాగోవిందం’ చిత్రంలో నటించి ఒక్కసారిగా తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ గా మారిపోయింది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్‌ ను దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడు పుష్ప చిత్రంలో బన్నీకి జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాను దర్శకుడు సుకుమార్‌ పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్న విషయం తెల్సిందే.

తెలుగుతో పాటు తమిళం.. కన్నడంలో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు హిందీలో స్టార్‌ డం కోసం వెయిట్‌ చేస్తోంది. పుష్ప చిత్రంతో హిందీ ప్రేక్షకులకు రష్మిక పరిచయం కాబోతుంది. అయితే అంతకు ముందే ఒక కన్నడ మూవీతో హిందీ ప్రేక్షకులకు రష్మిక పరిచయం అయ్యేందుకు సిద్దం అయ్యింది. కన్నడ స్టార్‌ ధృవ సర్జా హీరోగా నటించిన ‘పొగరు’ చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్‌ లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పొగరు చిత్రం ప్రమోషన్‌ ను షురూ చేశారు. ఈమద్య కన్నడ సినిమాలకు ఉత్తరాదిన మంచి డిమాండ్‌ ఉంది. కన్నడంలో తెరకెక్కిన కేజీఎఫ్‌ చిత్రం సూపర్‌ హిట్‌ దక్కించుకున్న తర్వాత కన్నడ సినిమాలకు అక్కడ క్రేజ్‌ పెరిగింది. అందుకే పొగరు చిత్రాన్ని అక్కడ పెద్ద ఎత్తున విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. అక్కడ పొగరు సక్సెస్‌ అయితే రష్మిక కు మంచి గుర్తింపు రావడం ఖాయం. ఇక పుష్ప కూడా హిందీలో హిట్‌ కొడితే రష్మికకు బాలీవుడ్‌ ఆఫర్లు కూడా క్యూ కట్టే అవకాశం లేకపోలేదు అంటున్నారు.