Begin typing your search above and press return to search.

శర్వానంద్ ను ఇరిటేట్ చేయడమే నా పని: రష్మిక

By:  Tupaki Desk   |   28 Feb 2022 2:52 AM GMT
శర్వానంద్ ను ఇరిటేట్ చేయడమే నా పని: రష్మిక
X
తెలుగులో రష్మిక వరుస విజయాలను సొంతం చేసుకుంటూ వెళుతోంది. ఇటీవల అల్లు అర్జున్ సరసన ఆమె చేసిన 'పుష్ప' భారీ విజయాన్ని సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో సంచలనాన్ని సృష్టించింది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసింది. ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా వచ్చేనెల 4వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ వేదికపై రష్మిక తనదైన స్టైల్లో మాట్లాడింది.

"ఈ సినిమాను సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. కోవిడ్ తరువాత ఒక మంచి ఎంటర్టైన్ మెంట్ ఇచ్చే సినిమా ఇది. మీరంతా చూస్తూ ఎంజాయ్ చేస్తారు .. హాయిగా నవ్వుకుంటారు. ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని నేను భావిస్తున్నాను. కోవిడ్ సమయంలో చాలామందికి చాలా బోర్ కొట్టేసింది. అలాంటి వాళ్లందరికీ ఇది పెర్ఫెక్ట్ సినిమా. మీ అందరికీ ట్రైలర్ నచ్చిందనే అనుకుంటున్నాను.

కిశోర్ గారు నాకు కాల్ చేసి .. చాలా మాట్లాడతాను ... అదీ ఇదీ అని చెప్పారు .. కానీ ఏమీ మాట్లాడలేదు. సైలెంట్ గా థ్యాంక్యూ అని చెప్పేసి వెళ్లిపోయారు. నాకు ఈ సినిమాలో చాలా పెద్ద అవకాశం ఇచ్చిన ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను. దేవిశ్రీ ప్రసాద్ గారి వంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి ఆయన మంచి పాటలు ఇచ్చారు. అందుకు ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను.

అలా సుజీత్ సార్ కెమెరా వర్క్ నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది .. స్క్రీన్ పై చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తాను. ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఇక శర్వా విషయానికి వస్తే తను చాలా స్వీట్. ఎంత ఇరిటేట్ చేసినా ఆయన ఇరిటేట్ కారు. నేను సెట్లో ఎలా ఉంటానో మీ అందరికీ తెలుసు కదా. నేను ఏం చేసినా ఆయన భరించాడు. నెక్స్ట్ ఫిల్మ్ లో ఇంకా ఇరిటేట్ చేస్తాను డేట్ రెడీ.

ఈ ఈవెంట్ కి సుకుమార్ గారితో పాటు సాయిపల్లవి .. కీర్తి సురేశ్ వచ్చినందుకు నాకు చేసేలా సంతోషంగా .. గర్వంగా ఉంది" అని చెప్పుకొచ్చింది.