Begin typing your search above and press return to search.

వెకేషన్ నుండి తిరిగొచ్చిన గీత గోవిందం జంట..!

By:  Tupaki Desk   |   12 Oct 2022 5:30 AM GMT
వెకేషన్ నుండి తిరిగొచ్చిన గీత గోవిందం జంట..!
X
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కొద్ది రోజుల క్రితం చిన్నపాటి వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. వీరిద్దరూ కలిసి వెళ్లనప్పటికీ.. సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్న ఫోటోలు ఇద్దరు కలిసి సెలవులను ఎంజాయ్ చేసినట్లు వెల్లడించాయి. ఈ సమయంలో ఈ జంట గురించి రకరకాలుగా వార్తలు ప్రచారం అయ్యాయి.

అయితే విజయ్ మరియు రష్మిక హాలిడేని ముగించుకొని మాల్దీవుల నుంచి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. గత రాత్రి వీరిద్దరూ సెలవుల నుండి తిరిగి వస్తుండగా.. ముంబై విమానాశ్రయంలో విడివిడిగా కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడి చేశాయి.

రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ లో మాల్దీవులను మిస్ అవుతున్నట్లు పోస్ట్ పెట్టడాన్ని బట్టి.. ట్రిప్ ముగిసిందని పేర్కొన్నట్లు అర్థం చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండ ఈ ట్రిప్ కు సంబంధించి ఎలాంటి ఫోటోలు షేర్ చేయలేదు కానీ.. రష్మిక మాత్రం సముద్రం, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వచ్చింది.

కెరీర్ ఆరంభంలోనే 'గీత గోవిందం' 'డియర్ కామ్రేడ్' వంటి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ లో విజయ్ - రష్మిక కలిసి రొమాన్స్ చేశారు. ఆన్ స్క్రీన్ లో కెమిస్ట్రీ పండించిన ఈ జంట.. తరచుగా హాలిడేకు వెళ్లడం.. ముంబై వీధుల్లో కలిసి కనిపిస్తుండటంతో అనేక పుకార్లు షికార్లు చేశాయి.

VD - రష్మిక మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని.. డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పటికే వీరిద్దరూ తమపై వస్తున్న వార్తలపై పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. తాము స్నేహితులం అని పదే పదే ఈ విషయాన్ని తెలియజేస్తున్నా.. ఇలా హాలిడేకి కలిసి వెళ్ళినప్పుడు మాత్రం జనాలు ఎప్పటిలాగే వారిద్దరు ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లుగా చెవులు కొరుక్కుంటుంటారు.

కాఫీ విత్ కరణ్ టాక్ షోలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. మేమిద్దరం కెరీర్ గురించి.. జీవితంలోని కష్టసుఖాలపై ఎప్పుడు మాట్లాడుకునేవాళ్లం. ఈ క్రమంలో మా మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. నిజంగా రష్మిక నా నిజమైన డార్లింగ్. తనంటే నాకు చాలా ఇష్టం'' అని చెప్పుకొచ్చాడు. రష్మిక సైతం పలు ఇంటర్వ్యూలలో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యామని తెలిపింది.

ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా పలు ఇద్దరూ క్రేజీ ప్రాజెక్ట్స్ తో తమ కెరీర్‌ లో బిజీగా ఉన్నారు. వీడీ హీరోగా 'ఖుషీ' వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. మరోవైపు రష్మిక 'మిషన్ మజ్ను' 'యానిమల్' వంటి హిందీ చిత్రాలతో పాటుగా 'వారసుడు' వంటి తెలుగు తమిళ ద్విభాషా చిత్రంలో నటిస్తోంది. మరికొన్ని రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనున్న 'పుష్ప: ది రూల్' లోనూ రష్మిక హీరోయిన్ గా కనిపించనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.