Begin typing your search above and press return to search.

ధ‌ర్మాధినేత ద‌ర్శ‌క‌త్వంలో గ‌ల్లీబోయ్ జంట‌

By:  Tupaki Desk   |   21 Aug 2021 10:30 AM GMT
ధ‌ర్మాధినేత ద‌ర్శ‌క‌త్వంలో గ‌ల్లీబోయ్ జంట‌
X
కరణ్ జోహార్ దేశంలోని టాప్ డైరెక్టర్లలో ఒకరు. అగ్ర నిర్మాత‌గా ప‌రిశ్ర‌మ‌ను శాసిస్తున్నారు. అయితే ఇటీవ‌లి కాలంలో ఆయ‌న ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో దర్శకత్వానికి దూరంగా ఉంటున్నారు. గతం కంటే ఇప్పుడు ఎక్కువగా సినిమాలు నిర్మిస్తున్నాడు. న‌వ‌త‌రం ట్యాలెంటుకు అవ‌కాశాలిస్తున్నారు.

ఇంత‌కుముందు త‌క్త్ అనే భారీ హిస్టారిక‌ల్ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని ప్ర‌చార‌మైంది. కానీ అది ఆదిలోనే ఆగిపోయింది. ఇప్పుడు అతను మరోసారి దర్శకత్వం వహించడానికి సిద్ధమ‌వుతున్నాడ‌ని తెలిసింది. ఈరోజు ఈ చిత్రం లాంచ‌నంగా ముంబైలో ప్రారంభమైంది.

ర‌ణ్ వీర్ సింగ్- ఆలియా భట్ - జయ భద్రూరి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా క‌థాంశంతో అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌నుంది. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. క‌ర‌ణ్ త‌దుప‌రి దోస్తానా 2 చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. రిలీజ్ కి రెడీ అవుతున్న బ్ర‌హ్మాస్త్ర‌కు అత‌డు స‌హ‌నిర్మాత‌. దేవ‌ర‌కొండ‌ను పాన్ ఇండియా స్టార్ గా ప‌రిచ‌యం చేస్తూ లైగ‌ర్ చిత్రాన్ని పూరి-ఛార్మితో క‌లిసి నిర్మిస్తున్నారు. ఇక వీటితో పాటు దాదాపు మ‌రో అర‌డ‌జ‌ను ప్రాజెక్టుల‌కు నిర్మాత‌గా క‌ర‌ణ్ బిజీగా ఉన్నారు. ర‌ణ‌వీర్ సింగ్ -ఆలియా భ‌ట్ జంట‌గా ఇంత‌కుముందు గల్లీబోయ్ తెర‌కెక్కింది. జోయా అక్త‌ర్ తెర‌కెక్కించిన ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డమే గాక ఆస్కార్ రేస్ కి నామినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి ఆ ఇద్ద‌రూ జోడీగా న‌టిస్తున్నారు.