Begin typing your search above and press return to search.

పవన్‌.. వెంకీల తర్వాత శర్వాతో మల్టీస్టారర్‌

By:  Tupaki Desk   |   29 Sep 2021 9:30 AM GMT
పవన్‌.. వెంకీల తర్వాత శర్వాతో మల్టీస్టారర్‌
X
టాలీవుడ్‌ లో మల్టీ స్టారర్ ల సందడి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున మల్టీ స్టారర్ చిత్రాలకు స్పందన దక్కుతున్న నేపథ్యంలో మేకర్స్ మల్టీ స్టారర్‌ కథలు సిద్దం చేస్తున్నారు. కొందరు స్టార్స్ కూడా తమ ఇమేజ్ ను పట్టించుకోకుండా మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. రానా ఈ విషయంలో చాలా మెచ్యూర్డ్‌ గా ఆలోచిస్తున్నాడు అంటూ మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రానా బాలీవుడ్ లో పలువురు హీరోలతో కలిసి నటించిన విషయం తెల్సిందే. బాహుబలి సినిమాలో ప్రభాస్ తో కలిసి రానా నటించాడు. ఆ సినిమాలో రానా విలన్ గా నటించినా కూడా ప్రభాస్ కు ఏమాత్రం తగ్గని పాత్ర అది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమా రానా స్థాయిని మరింతగా పెంచింది.

విలన్ గా నటించినా కూడా హీరోగా ఆయన్ను స్టార్‌ ను చేసింది. హిందీలో పలు ఆఫర్లు రానా తలుపు తడుతున్నాయని సమాచారం అందుతోంది. ఇక తెలుగు లో భీమ్లా నాయక్ సినిమాలో పవన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్దం అయ్యాడు. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ పాత్ర డామినేషన్‌ ఉంటుంది.. అయినా కూడా రానా పాత్ర నచ్చడంతో పాటు పవన్‌ తో స్క్రీన్ షేర్‌ చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓకే చెప్పేశాడు. వెంకటేష్‌ తో ఒక వెబ్‌ సిరీస్ ను కలిసి చేస్తున్నాడు. ఆ వెబ్‌ సిరీస్ కు రానా నాయుడు అనే టైటిల్ ను ఖరారు చేశారు. అతి త్వరలోనే ఆ వెబ్‌ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో మల్టీ స్టారర్ ను కూడా రానా కమిట్‌ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న సినిమాలో శర్వానంద్‌ తో కలిసి రానా నటించబోతున్నాడు. ఈ సినిమా లో శర్వా మరియు రానాలు ఇద్దరు కూడా హీరోలుగానే కనిపించబోతున్నారు. ఇద్దరికి సమాన ప్రాముఖ్యతతో ఒక కథను రెడీ చేయడం జరిగిందట. కొత్త దర్శకుడు ఈ సినిమాను లీడ్‌ చేయబోతున్నాడు. ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో మల్టీ స్టారర్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇద్దరు హీరోలు కూడా ఆయన్ను నమ్మి మల్టీ స్టారర్ చేసేందుకు ఓకే చెప్పారు అంటే కథ వారిని ఎంతగా ఇన్సిపైర్‌ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అతి త్వరలోనే ఈ మల్టీ స్టారర్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. ఈ సినిమా ప్రకటించిన వెంటనే అందరి లో ఖచ్చితంగా ఆసక్తి రేకెత్తడం ఖాయం.. సినిమా ప్రకటించడంతోనే బజ్‌ క్రియేట్‌ అవ్వడం పక్కా అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం శర్వానంద్‌ మహాసముద్రం సినిమా విడుదలకు సిద్దం చేస్తున్నారు. మరో వైపు శర్వా రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. రానా కూడా ఒక వైపు విరాటపర్వం ను విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నాడు. మరో వైపు పవన్‌ తో కలిసి భీమ్లా నాయక్‌ సినిమాను చేస్తున్నాడు. అన్ని ప్రాజెక్ట్ లను ముగించిన తర్వాత వీరిద్దరు కలిసి మల్టీ స్టారర్ మూవీకి సిద్దం అవ్వబోతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను పట్టాలెక్కించేలా ప్లాన్‌ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలోనే సినిమాను విడుదల చేసేలా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయట. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ బడ్జెట్‌ తో నిర్మించేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే మైత్రి వారు ఈ ప్రాజెక్ట్‌ కు సంబంధించి లీడ్ ఇవ్వబోతున్నారు. దర్శకుడు ప్రస్తుతం స్క్రిప్ట్‌ కు తుది మెరుగులు అద్దుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మెల్ల మెల్లగా సాగుతున్నట్లుగా మైత్రి వారి నుండి అనధికారిక సమాచారం అందుతోంది.