Begin typing your search above and press return to search.

ఏంటి.. రానా షూటింగ్ ప్లేస్ నుండి పారిపోయాడా!

By:  Tupaki Desk   |   9 May 2020 3:00 PM GMT
ఏంటి.. రానా షూటింగ్ ప్లేస్ నుండి పారిపోయాడా!
X
'నీది నాది ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా 'విరాటపర్వం' అనే సినిమాలో నటిస్తున్నారు. 1990ల నాటి కథాంశంతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటివరకు 70శాతం పైనే షూటింగ్ పూర్తి చేసుకుందట. ఇక ఈ చిత్రంలో రానా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా, సాయిపల్లవి నక్సలైట్ గా కనిపించనుంది. ఇక విరాట పర్వం షూటింగ్.. వరంగల్, కేరళ, వికారాబాద్ లలోని దట్టమైన అడవి ప్రాంతాలలో జరిపారట. ఓసారి కేరళ అడవులలో షూటింగ్ జరుపుతుండగా.. సాయంత్రం ప్యాక్ అప్ చెప్పేముందు ఓ ఏనుగుల గుంపు ఈ చిత్రయూనిట్ వైపు పరిగెత్తుకుని వచ్చాయట. అయితే ఆ ఏనుగుల గుంపును చూసి విరాటపర్వం చిత్రయూనిట్ అంతా అక్కడే కెమెరా, సెట్ ఇలా అన్నీ సామాన్లను వదిలేసి ప్రాణభయంతో దూరంగా పారిపోయారట. ఆ ఏనుగుల గుంపు వచ్చే సమయంలో హీరో రానా కూడా దూరంగా పారిపోవడంతో.. ఆ స్థలంలో కేవలం డైరెక్టర్ వేణు, హీరోయిన్ సాయిపల్లవి మాత్రమే మిగిలి ఉన్నారట.

అయితే ఆ పెద్ద ఏనుగుల గుంపు వీరి సినిమా సెట్ నుండి అలా వెళ్లిపోయాయట. కానీ ఎవరికీ ఏనుగుల వలన ఎటువంటి అపాయం జరగలేదట. ఇక ఆ సమయంలో హీరో రానా పారిపోవడం కాస్త ఆసక్తి కరంగా మారిన విషయం.. ఎందుకంటే హీరోయిన్, డైరెక్టర్ అక్కడే ఉన్నా సినిమాకి ప్రధాన హీరో అలా ప్రాణభయంతో వెళ్లడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించేదే. తనతో పాటు వేణు, సాయిపల్లవిని కూడా తీసుకెళ్లవచ్చు కదా.. ఓకే ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ లో అదొక భయంకరమైన అలాగే మంచి ఎస్కేప్ అని.. ఇక అందరూ ప్రాణాలతో బయట పడ్డారు గనక వారంతా అదృష్టంగా భావిస్తున్నారు. ఇక ఈ విరాట పర్వం షూటింగ్ ఇంకా కొద్దిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా.. సురేష్ బాబు, చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.