Begin typing your search above and press return to search.

క‌సి తీరేంత హిట్ కొట్టాల‌ని రానా ప్లాన్

By:  Tupaki Desk   |   31 March 2021 3:30 PM GMT
క‌సి తీరేంత హిట్ కొట్టాల‌ని రానా ప్లాన్
X
ప‌రాజ‌యం త‌ర్వాత క‌సి మ‌రింత పెరుగుతుంది. ఫ్లాప్ భావ‌న నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు వెంట‌నే బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌న్న పంతం పెరుగుతుంది. ప్ర‌స్తుతం రానా స‌న్నివేశం అలానే ఉంద‌నేది ఇన్ సైడ్ టాక్. అర‌ణ్య ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డం అత‌డిని నిరాశ‌ప‌రిచింది. ఒక మంచి ప్ర‌య‌త్నం చేశారు. అవార్డులొస్తాయ‌న్న టాక్ త‌ప్ప క‌మ‌ర్షియ‌ల్ విజ‌యం సాధించే స‌త్తా లేద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. అయితే అన్నిటికీ స‌మాధానం చెప్పేందుకు అతడు త‌దుప‌రి విరాఠ‌ప‌ర్వం చిత్రాన్ని రెడీ చేస్తున్నాడ‌ని తెలిసింది.

రానా దగ్గుబాటి- సాయి పల్లవి జంట‌గా న‌టించిన‌ విరాఠ‌పర్వం ఈ సీజ‌న్ బెస్ట్ సినిమాగా నిలుస్తుంద‌ని రానా బ‌లంగా న‌మ్ముతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సాయిప‌ల్ల‌వి వేవ్ ప్ర‌కంప‌న‌లు రేపింది. న‌క్స‌లిజం బ్యాక్ డ్రాప్ ఆద్యంతం ఎమోష‌న్ ర‌గిలించింది. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30 న తెరపైకి రానుంది.

తాజా స‌మాచారం మేర‌కు..ఏప్రిల్ మొదటి వారం నుండి దూకుడుగా ప్ర‌చారం ప్రారంభించ‌నున్నార‌ని తెలిసింది. రానా తన బృందంతో కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు న‌గ‌రాల్లో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారట‌. ఈ చిత్రంలో ప్రియమణి- నందితా దాస్- నవీన్ చంద్ర- ఈశ్వరి రావు- జరీనా వహాబ్ - నివేదా పెథురాజ్ కీలక పాత్రల్లో నటించారు. సురేష్ బాబు సమ‌ర్ప‌కులుగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.