Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : పంజాబ్ లో మన రామరాజు జోరు చూడండి

By:  Tupaki Desk   |   16 April 2022 5:32 AM GMT
పిక్ టాక్ : పంజాబ్ లో మన రామరాజు జోరు చూడండి
X
బాహుబలి సినిమా తో ప్రభాస్ కు ఏ స్థాయిలో ఉత్తరాదిన స్టార్ డమ్ దక్కిందో అలాగే ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా తో రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్ కు ఉత్తర భారతంలో స్టార్ లుగా ఇమేజ్ సొంతం అయ్యింది. ఇంతకు ముందు తో పోల్చితే రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ లకు గుర్తింపు అక్కడ రెట్టింపు ఉంది అనడంలో సందేహం లేదు.

ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ఉత్తర భారతంలో భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ ఇద్దరు హీరోలు అక్కడ కనిపిస్తే చాలు జనాలు ఎగబడుతున్నారు. ఆమద్య రామ్‌ చరణ్‌ ను ముంబయి లో అభిమానులు వెంబడించిన తీరు మర్చి పోక ముందే మరో సంఘటన జరిగింది.

హీరోల జోరు చూసి ముందు ముందు వారు చేయబోతున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కావాల్సిందే అంటున్నారు.

రామ్‌ చరణ్ తాజాగా పంజాబ్ లో పర్యటించాడు. ఆ సమయంలో అక్కడి పోలీసు ఉన్నతాధికారులు ఆయన తో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. పంజాబ్‌ లో చరణ్‌ కు గతంలో అస్సలు గుర్తింపు ఉండేది కాదు. ఎప్పుడైతే ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుందో అప్పటి నుండి పంజాబ్ లో చరణ్ పేరు మారు మ్రోగుతుంది.

చరణ్‌ తో పోలీసులు తీసుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. చరణ్‌ పై వారికి ఉన్న అభిమానంను ఈ ఫోటో రూపంలో తెలియజేస్తున్నారు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ లో అల్లూరి సీత రామరాజు పాత్రలో నటించిన చరణ్‌ ను ఉత్తరాది అభిమానులు రామరాజు అంటూ పిలుచుకుంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో చరణ్‌ ను చూసి శ్రీరాముడు అంటూ పూజలు చేసిన వారు కూడా ఉత్తరాదిన ఉన్నారు.

ఉత్తర భారతంలోనే కాకుండా తమిళం మరియు మలయాళంలో కూడా మంచి వసూళ్లను ఆర్ ఆర్ ఆర్‌ రాబట్టి అక్కడ కూడా మంచి క్రేజ్ ను హీరోలు దక్కించుకున్నారు. హీరో లుగా ఇద్దరి జోరు మామూలుగా లేదు. ప్రస్తుతం చరణ్‌ తన 15వ సినిమా శంకర్‌ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఎన్టీఆర్‌ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ఉండబోతుంది.