Begin typing your search above and press return to search.

మర్డర్ సినిమా చిత్తశుద్ధితోనే తీస్తున్నా: స్టార్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   23 Jun 2020 12:30 PM GMT
మర్డర్ సినిమా చిత్తశుద్ధితోనే తీస్తున్నా: స్టార్ డైరెక్టర్
X
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవలే క్లైమాక్స్ సినిమాతో రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఆ విషయం మర్చిపోక ముందే మరో సినిమా నగ్నం అంటూ షాక్ ఇచ్చాడు. కేవలం నగ్నం ట్రైలర్ తోనే రచ్చ లేపిన వర్మ.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచిన మిర్యాలగూడ ప్రణయ్ - అమృతల హత్య కేసును సినిమాగా రూపొందిస్తున్నట్లు ప్రకటించి మరో షాక్ ఇచ్చాడు. తాజాగా అమృత అలాగే ఆమె తండ్రి మారుతి రావు పాత్రలకు సంబంధించిన లుక్స్ తో వర్మ ఇటీవల పోస్టర్ రిలీజ్ చేసాడు. ఆ సినిమాకు 'మర్డర్: కుటుంబ కథా చిత్రం' అని టైటిల్ కూడా రిలీజ్ చేసాడు.

ఆ పోస్టర్ చూడగానే సినిమా మిర్యాలగూడ పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు అర్ధమవుతుంది. ఇక ఈ సినిమా అమృత - ప్రణయ్ లకు సంబంధించినదే అంతా అనుకుంటుండగా.. అమృత ఒక లేఖను విడుదల చేసింది. ఆ కథ తన జీవితానికి సంబంధించినది కాదని.. ఆ సినిమాకు నాకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే భర్తను తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నట్లు ఆమె ఒక లెటర్ విడుదల చేసింది. ఇలాంటి సమయంలో విషాదకరమైన ఘటన పై సినిమాలు చేయడం ఏమిటని అమృత లేఖలో తెలిపింది.

ఇక వర్మ స్పందించి.. "సినిమా పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అమృత లేదా మరెవరైనా కావచ్చు.. వారికి నా ఫైనల్ సందేశం ఇదే. విపరీతమైన బాధను అనుభవించిన వారి పట్ల నాకు చాలా గౌరవం ఉంది. ఇక మర్డర్ సినిమాలో బాధను అనుభవించిన వారిని గౌరవంగా చూపించడమే జరుగుతుందని చిత్తశుద్ధితో జరిగిన పరిణామాలను సినిమాలో చూపించనున్నట్లు" క్లారిటీ ఇచ్చాడు. అంతేగాక మర్డర్ సినిమాకు సంబంధించిన మరికొన్ని పోస్టర్లను ఆర్జీవీ విడుదల చేశాడు. అందులో ప్రణయ్ లుక్ కి సంబంధించిన పోస్టర్ విడుదల చేసి.. వర్మ ఈ సినిమా పై మరింత ఆసక్తి రేపుతున్నాడు.