Begin typing your search above and press return to search.

బెంగ‌ళూరు నుంచి చ‌ర‌ణ్ నెల్లూరు దేనికి వెళ్లారు?

By:  Tupaki Desk   |   31 Aug 2020 5:32 PM GMT
బెంగ‌ళూరు నుంచి చ‌ర‌ణ్ నెల్లూరు దేనికి వెళ్లారు?
X
యువి క్రియేషన్స్ వంశీ తండ్రి నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఒక ప్ర‌యివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అంత్యక్రియలు నేడు నెల్లూరులో జరిగాయి. ఈ మరణానికి కారణం వయస్సు సంబంధిత వ్యాధులు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

నేటి ఈ అంత్య‌క్రియ‌ల్లో బెంగళూరు నుండి నెల్లూరు వెళ్లార‌ట రామ్ చ‌ర‌ణ్‌. ఇక బెంగ‌ళూరు ప‌రిస‌రాల్లోని ఫామ్ హౌస్ లోనే రామ్ చరణ్ కొంతకాలంగా తన కుటుంబంతో ఉంటున్నార‌ని తెలిసింది. అలాగే యువి అధినేత‌ల క్లోజ్ ఫ్రెండ్ శ‌ర్వానంద్ కూడా హైదరాబాద్ నుండి అంత్యక్రియలకు వెళ్లారు. హైదరాబాద్ లోనే వంశీని కలిసి డార్లింగ్ ప్రభాస్ సంతాపం తెలిపార‌ని స‌మాచారం.

యువి క్రియేషన్స్ టాలీవుడ్ లో అగ్ర బ్యాన‌ర్ గా స‌త్తా చాటుతోంది. మిర్చి- రన్ రాజా రన్ - సాహో వంటి పెద్ద చిత్రాలను ఈ సంస్థ నిర్మించింది. ప్ర‌స్తుతం వ‌రుస‌గా భారీ సినిమాల్ని నిర్మిస్తూ న‌వ‌త‌రంతో మిడ్ రేంజు సినిమాల్ని తీస్తున్నారు. వంశీ స‌న్నిహితులంతా అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సంతాపం తెలిపారు.